బొమ్మరిల్లు భాస్కర్ కెంబ్యాక్ మూవీ: జాక్
టాలీవుడ్లో రొమాంటిక్ ఎంటర్టైనర్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్, చాలా సంవత్సరాల విరామం తర్వాత “జాక్” అనే స్పై యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా ఆకట్టుకుంది. ఈ యంగ్ జోడీ హాజరైన ప్రతి సన్నివేశంలో తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులని మెప్పించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సిద్ధు నటనతో పాటు టెక్నికల్ వాల్యూస్ పరంగా కూడా హైలైట్ అయ్యింది. మొదటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నా, విడుదల అనంతరం ప్రేక్షకుల అభిప్రాయాలు మిశ్రమంగా మారాయి.
సిద్ధు జొన్నలగడ్డ రైజింగ్ స్టార్
కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన సిద్ధు, తన నటనతో పాటు స్క్రిప్ట్ సెలెక్షన్లో చూపిన తెలివితేటలతో ఓవర్నైట్ స్టార్గా ఎదిగాడు. డీజే టిల్లు సినిమాతో ఆయనకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. యువతలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న సిద్ధు, టిల్లు సక్సెస్ను కొనసాగిస్తూ “టిల్లు స్క్వేర్” అనే సీక్వెల్తో మరో హిట్ అందుకున్నాడు. ఈ క్రేజ్ను కొనసాగించే క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో “జాక్” అనే ప్రయోగాత్మక చిత్రాన్ని చేశారు. ఇందులో ఆయన న్యూఏజ్ స్పై పాత్రలో కనిపించి, యాక్షన్ మరియు ఎమోషన్ల మిశ్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
భారీ ప్రమోషన్స్.. మిశ్రమ స్పందన
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై B.V.S.N ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా అత్యంత గ్రాండ్గా నిర్వహించారు. ట్రైలర్లు, పోస్టర్లు, ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో హైప్ను పెంచారు. ఏప్రిల్ 10న గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా మొదట భారీ ఓపెనింగ్స్ సాధించగా, తరువాత కథనం, స్క్రీన్ప్లే విషయంలో ప్రేక్షకుల స్పందన తేలికపాటిగానే కనిపించింది. అయితే సిద్ధు ఫ్యాన్స్ మాత్రం ఆయన నటనను, స్టైల్ను పొగడ్తలతో ముంచెత్తారు.
ఓటీటీలోకి జాక్.. ఎప్పుడు?
సినిమా థియేటర్లలో విడుదలైనప్పటి నుండి ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడు డిజిటల్ ప్లాట్ఫార్మ్లో చూడొచ్చా అని ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, జాక్ మూవీ మే 1న నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫార్మ్లో విడుదలకానుందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. నెట్ఫ్లిక్స్లో మల్టీ లాంగ్వేజ్ ఆప్షన్ ఉండటంతో, పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా ఈ సినిమాను ఆస్వాదించే అవకాశం ఉంది.
కీలక తారాగణం
ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీలు కీలక పాత్రల్లో మెరిశారు. సినిమా నేపథ్యం, యాక్షన్ సన్నివేశాలు, మరియు ఎమోషనల్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరించాయి.
READ ALSO: Mad Square OTT: ఓటీటీలోకి వచ్చేసిన మ్యాడ్ స్క్వేర్.. ఎక్కడ చూడొచ్చంటే?