తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ ప్రేమ కథా చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరికీ ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. అయినా తమ అద్బుత నటనతో ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించారు. ఇక సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో బాగా భయపెట్టాడు. ఈ సినిమాలో అతని నటనే హైలెట్ అని చెప్పుకోవచ్చు.
Read Also: Vijay: ఆడియో రిలీజ్.. అభిమానులను వారించిన విజయ్ ఎందుకంటే?
ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటింది
నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టింది.ఈ నెల 18 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ (Etv Win) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటినట్లు ఈటీవీ విన్ (Etv Win) అధికారికంగా వెల్లడించింది. థియేటర్లలో 2 గంటల 15 నిమిషాల నిడివితో విడుదలైన ఈ చిత్రం,

ఓటీటీలో ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా ఎక్స్టెండెడ్ కట్తో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ విజయోత్సాహంలో భాగంగా ఈటీవీ విన్ ప్రత్యేక ఆఫర్ను కూడా ప్రకటించింది. నెలవారీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకునేవారు RWR50 కోడ్ను ఉపయోగిస్తే రూ.50 రాయితీ, అలాగే, వార్షిక సబ్స్క్రిప్షన్కు RWR100 కోడ్ ద్వారా రూ.100 తగ్గింపు పొందవచ్చని ప్రకటించింది.’రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాన్ని మళ్లీ మళ్లీ వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈటీవీ విన్ ధన్యవాదాలు తెలియజేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: