📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Rajamouli : ఎస్ఎస్ఎమ్ బి సినిమా కోసం రాజ‌మౌళి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా!

Author Icon By Anusha
Updated: April 25, 2025 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ప్రాజెక్ట్ ‘ఎస్ఎస్ఎమ్ బి 29’. ఈ సినిమా కోసం యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న చిత్రం నుంచి ఇప్పుడు సూపర్ అప్డేట్​ వచ్చింది.ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా తదుపరి షెడ్యూల్‌లో భాగంగా నీటిలో ఒక భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు సుమారు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు పాల్గొననున్నారని తెలుస్తోంది. వీరంతా ఈ సన్నివేశం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని సమాచారం. ఈ సీక్వెన్స్‌ను మే నుంచి జూన్ వరకు చిత్రీకరించనున్నారు. దీని కోసం హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ల నేతృత్వంలో ఈ యాక్షన్ ఘట్టాన్ని షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా సాహసయాత్ర చేసే ఒక సాహసికుడి కథగా ఉండనుంది.

షూటింగ్

ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.ఒడిశా షెడ్యూల్​లో మహేశ్ బాబుపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు రెండు వారాలు జరిగిన షూటింగ్ పూర్తైంది. ఇక అక్కి ప్రకృతి అందాలు తమని ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఇదొక స్వర్గసీమ అని మూవీటీమ్ అభివర్ణించింది. 

కంటీన్యూ

ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌డిగా రాజ‌మౌళికి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తీసిన ప్ర‌తి సినిమా కూడా హిట్టే. చిన్న సినిమా అయిన పెద్ద సినిమా అయిన బాక్సాఫీస్‌ని షేక్ చేయాల్సిందే.హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో కంటీన్యూగా నెల రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుండగా , మూవీ కోసం రాజ‌మౌళి భారీ రెమ్యున‌రేష‌న్ అందుకోబోతున్న‌ట్టు స‌మాచారం. సాధార‌ణంగా రాజ‌మౌళి స్టార్ హీరోలను మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండియాస్ హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్ గా రికార్డ్ సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయ‌న మ‌హేష్ బాబు ఈ సినిమాకు 200 కోట్ల రూపాయల వరకు తీసుటున్నట్లు ఐఎండీబీ కూడా ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్ఎస్ఎమ్ బి 29 ప్రాజెక్ట్ కోసం మహేశ్ బాబు కంటే రెండింతల భారీ రెమ్యూనరేషన్ రాజమౌళి తీసుకుంటున్నారు అనే వార్త బ‌య‌ట‌కు రాగా, అంద‌రు షాక్ అవుతున్నారు.రాజ‌మౌళి రెమ్యున‌రేష‌న్‌తో పాటు ఈ మ‌ధ్య సినిమా ప్రాఫిట్స్ లో కూడా షేర్ తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో మ‌హేష్ బాబు సినిమా కోసం కూడా షేర్ తీసుకునే చాన్స్ ఉందంటున్నారు. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఎస్ఎస్ఎమ్ బి 29 ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.

Read Also: Prakash Raj : ఇది కశ్మీర్‌పై జరిగిన దాడి : నటుడు ప్రకాశ్ రాజ్

#BiggestIndianFilm #HighBudgetMovie #MaheshBabu #Rajamouli #SSMB29 #SSMB29Update Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.