లండన్లో ‘ఆర్ఆర్ఆర్’ లైవ్ కాన్సర్ట్ గ్రాండ్ సక్సెస్ – ఎన్టీఆర్, రామ్చరణ్ సందడి
చాలా రోజుల తరువాత తెలుగు సినీ అభిమానులు ఊహించని దృశ్యాన్ని చూశారు. మళ్లీ ఒకే వేదికపై రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కనిపించి అభిమానులకు కనిపించి సందడి చేశారు. లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ లైవ్ కాన్సర్ట్ను ఎంతో గొప్పగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం దర్శకధీరుడు రాజమౌళి, మ్యూజిక్ మాస్ట్రో ఎం.ఎం.కీరవాణి, హీరోలు రామ్చరణ్, ఎన్టీఆర్ ఒకే వేదికపై చేరడంతో అక్కడి ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో ఒక రకమైన ఉత్సాహం నెలకొంది.
ఈ ఈవెంట్లో ఎన్టీఆర్-చరణ్ మధ్య ఉన్న బాండింగ్ స్పష్టంగా కనిపించింది. ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం, రామ్చరణ్ ఎన్టీఆర్కు ముద్దుపెట్టడం వంటి హృదయాన్ని హత్తుకునే దృశ్యాలు అభిమానుల మనసులను గెలుచుకున్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. ఫ్యాన్స్ వీటిని రెడిట్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి అన్ని ప్లాట్ఫాంలలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ ఇద్దరు నటులు ఒకరిపై ఒకరు చూపించిన ఆత్మీయత, స్నేహం, గౌరవం తెలుగు చలనచిత్ర రంగానికి ఒక స్ఫూర్తిగా నిలిచేలా ఉంది
వేదికపై ఎన్టీఆర్ భావోద్వేగ ప్రసంగం – చిరు, బాలయ్య గురించి మాట్లాడిన తారక్
ఈ కాన్సర్ట్ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “నాటు నాటు పాటలో నా బెస్ట్ ఫ్రెండ్ రామ్చరణ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా జీవితంలో మరిచిపోలేని సందర్భం” అని ఆయన తెలిపారు. అంతేకాకుండా చెర్రీ తండ్రి మెగాస్టార్ చిరంజీవి గొప్ప డ్యాన్సర్ అని, తన బాబాయ్ నందమూరి బాలకృష్ణ కూడా ఎనర్జిటిక్ డ్యాన్సర్ అని గుర్తు చేశారు. “వీరిద్దరూ కలిసి నాటు నాటు పాటకు స్టేజ్పై డ్యాన్స్ చేస్తే అది చరిత్రలో చెరగని జ్ఞాపకంగా నిలిచిపోతుంది” అని తారక్ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై మెగా, నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో విశేషంగా స్పందిస్తున్నారు. “ఒకే సినిమాకు కలిసి పని చేయలేకపోయినా, ఓ పాట కోసం చిరు-బాలయ్య కలిసి డ్యాన్స్ చేస్తే చాలు.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం” అంటూ వారు కామెంట్లు చేస్తున్నారు. ఈ వేదికపై ఎన్టీఆర్ చెప్పిన మాటలు అభిమానుల మధ్య ఉన్న గ్యాప్ను కూడా తగ్గించాయి. సినీ ప్రేమికులు ఇది ఒక ప్రత్యేకమైన క్షణంగా భావిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ విజయం – తెలుగు సినిమాకు గౌరవం
‘ఆర్ఆర్ఆర్’ సినిమా రూపంలో రాజమౌళి జీవితంలో ఒక్కసారైనా పొందగలిగే మరో అనుభవం ను ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతర్జాతీయంగా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలిచిన ఘనతను సొంతం చేసుకుంది. ఇది తెలుగుతనాన్ని ప్రపంచానికి చూపించిన మ్యూజికల్ మాస్టర్పీస్గా నిలిచింది. హాలీవుడ్ వర్గాలు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించాయి. దాంతో తెలుగు సినిమా స్థాయిని, సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన సినిమా ఇది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన లైవ్ కాన్సర్ట్ మరోసారి ఆ సినిమా స్ఫూర్తిని గుర్తు చేసింది. కీరవాణి సంగీతం, కోటి మందికి ఆనందాన్ని కలిగించిన పాటలు, చెర్రీ-తారక్ కెమిస్ట్రీ – ఇవన్నీ కలిసి ఆ వేదికను చారిత్రాత్మకంగా మార్చేశాయి. అభిమానులు ఈ త్రిమూర్తులను చూసి మరింత గర్వపడేలా చేసింది.
Read also: Chandrababu: తారక రామరావుకు వెల్ విషెస్ చెప్పిన చంద్రబాబు