हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Film Producer: థియేటర్ల పరిష్కారానికి 27 మందితో కమిటీ: సి.కల్యాణ్

Anusha
Film Producer: థియేటర్ల పరిష్కారానికి 27 మందితో కమిటీ: సి.కల్యాణ్

విశాఖపట్నంలో సినీ రంగ ప్రముఖులు తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై చర్చించేందుకు శుక్రవారం సమావేశమయ్యారు. నగరంలోని దొండపర్తి(Dondaparthi)లో జరిగిన ఈ సమావేశంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ భేటీకి ప్రముఖ నిర్మాతలు స్రవంతి రవికిశోర్‌, సి.కల్యాణ్‌, సుధాకర్‌రెడ్డి, భరత్‌ భూషణ్‌ తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం నిర్మాత సి.కల్యాణ్‌ మీడియా ప్రతినిధులతో,సమావేశంలో మాట్లాడి, చర్చించిన అంశాలను మీడియా కు వివరించారు.సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, పర్సంటేజీల విధానం వంటి ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించినట్లు సి.కల్యాణ్‌(C.Kalyan) తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

ప్రభుత్వానికి

డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సంఘాలకు చెందిన సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ప్రతి సంఘం నుంచి తొమ్మిది మంది చొప్పున మొత్తం 27 మంది సభ్యులతో ఈ కమిటీ(Committee) ఉంటుంది” అని సి.కల్యాణ్‌ పేర్కొన్నారు. కమిటీలో పాలుపంచుకునే సభ్యుల పేర్లను తొలుత ప్రభుత్వానికి తెలియజేస్తామని, అనంతరం సోమవారం నాడు కమిటీకి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

 
 Film Producer: థియేటర్ల పరిష్కారానికి 27 మందితో కమిటీ: సి.కల్యాణ్
Film Producer: థియేటర్ల పరిష్కారానికి 27 మందితో కమిటీ: సి.కల్యాణ్

ఆశాభావం

ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, థియేటర్ల నిర్వహణ, పంపిణీలో పర్సంటేజీల విధానం వంటి అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు ఆయన పునరుద్ఘాటించారు. సినిమా హాళ్ల(Cinema halls)లో జరుగుతున్న తనిఖీల గురించి ప్రస్తావిస్తూ, అవి నిరంతర తనిఖీల్లో భాగంగానే జరుగుతున్నాయని, ఇందులో అసాధారణమేమీ లేదని అన్నారు. ప్రతి నెలా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(Executive Council) సమావేశం జరుగుతుందని కూడా కల్యాణ్‌ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కమిటీ ఏర్పాటుతో పరిశ్రమలోని పలు సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Read Also: Bhairavam Movie: భైరవం మూవీ రివ్యూ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870