తమన్నా నాయిక ప్రధానమైన పాత్రలను పోషిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే హార్రర్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలలోను గట్టిగానే కనిపిస్తోంది. అలా ఈ మధ్య వచ్చిన ‘అరణ్మనై 4’ సినిమాలోనూ దెయ్యంగా ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేసింది. అలాంటి ఆమె ఇప్పుడు దెయ్యాల ఆటకట్టించే మాంత్రికురాలుగా కనిపించనుంది. తమన్నా మాంత్రికురాలిగా కనిపించే సినిమా ‘ఓదెలా 2’.అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన ‘ఓదెలా రైల్వేస్టేషన్’ 2022లో థియేటర్స్ లోకి వచ్చింది. హెబ్బా పటేల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఆ సినిమా, ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాంటి ఆ సినిమాకి ఇది సీక్వెల్. ఆ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా పలకరిస్తే, ఈ సినిమా హార్రర్ థ్రిల్లర్ గా అలరించనుంది. సంపత్ నంది కథ – స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది.ఈరోజు థియేటర్ లో విడుదలైంది ఓదెల 2 మూవీ.
హైలైట్
ఈ నేపథ్యం లో మూవీ టీమ్ హైదరాబాద్లో సక్సెస్మీట్ను నిర్వహించారు.దర్శకుడు సంపత్నంది మాట్లాడుతూ,ఈ సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలన్నీ నిజమయ్యాయి. నాగసాధువుగా తమన్నా పర్ఫార్మెన్స్ హైలైట్గా నిలుస్తుందని ముందే చెప్పాను. ఈ రోజు ఆడియన్స్ కూడా అదే మాట అంటున్నారు. శుక్రవారం నుంచి ఈ సినిమా సునామీ మొదలుకాబోతున్నది. శివశక్తిగా తమన్నా చేసే రచ్చ అప్పుడే ఆరంభమవుతుంది’ అన్నారు.
కథ విషయానికొస్తే
ఓదెలలో తిరుపతి (వశిష్ట ఎన్ సింహా)ను అతడి భార్య రాధ (హెబ్బా పటేల్) చంపేసిన తర్వాత ఊరు అంతా పండగ చేసుకుంటుంది. రాధ జైలుకు వెళ్లింది. తిరుపతి శవానికి పోస్ట్మార్టం పూర్తయింది. బాడీని ఇంట్లోవారికి అందజేశారు. తిరుపతి శవాన్ని ఊళ్లోకి తీసుకొచ్చారు. ఊళ్లోజనం ఉసురు పోసుకున్నాడన్న కసితో ఊళ్లోవారెవరూ తిరుపతి శవాన్ని చూడ్డానికి కూడా రాలేదు. సరికదా అతని ఆత్మని కూడా శిక్షించాలని నిర్ణయించుకుంటారు. ఊరి పూజారి సలహా మేరకు అతని శవాన్ని నిలువనా నిలబెట్టి, అతని శరీరాన్ని కోడి నెత్తురుతో తడిపి, ఊళ్లో జనం గోళ్లు మూటగట్టి ఆ మూటతో సహా అతన్ని పాతిపెడతారు. అలా నిలువునా పాతిపెడితే అతని ఆత్మకు శాంతి క్షోభకు గురి అవుతుందని వారి నమ్మకం. ఊరి జనం చేసిన పనివల్ల తిరుపతి ఆత్మ నిజంగానే క్షోభ చెందుతుంది. ఆ బాధ కాస్తా పగగా మారుతుంది. తను దెయ్యంగా మారతాడు. ఊర్లో కొత్తగా పెళ్లయిన జంటల్నీ టార్గెట్ చేసి, భయంకరంగా చంపతుంటాడు. వేరేవాళ్ల శరీరాల్లోకి ప్రవేశించి వారి ద్వారా తన పనిని పూర్తి చేస్తుంటాడు. ఈ చర్యలవల్ల అమాయకులు బలైపోతుంటారు. అలాంటి సమయంలో తరుణోపాయం కోసం ఊరిజనం జైల్లో ఉన్న రాధను కలుస్తారు. ‘వాడ్ని చంపింది నువ్వే. ఇప్పుడు కాపాడాల్సింది నువ్వే’ అని ప్రాధేయపడటంతో రాధ తన అక్క భైరవి(తమన్నా) గురించి ఊరు జనాలకు చెబుతుంది. ఈ దెయ్యం ఆటకట్టించే శక్తి భైరవికి మాత్రమే ఉందని రాధ ఊరి జనాలకు చెప్పడంతో ఊరిజనం భైరవిని వెతికే ప్రయత్నాలు మొదలుపెడతారు. తన జీవితాన్ని శివుడికే అంకితం చేసిన నాగసాధు భైరవి. మరి భైరవిని ఊరుజనం ఎలా చేరారు? ఊరికి పట్టిన పీడను భైరవి ఎలా వదిలించింది? ఈ క్రమంలో క్షుద్రశక్తితో భైరవి చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ.
Read Also: Anurag Kashyap: ఈ ఏడాది ఐదు సినిమాలు డైరెక్ట్ చేయబోతున్నా:అనురాగ్ కశ్యప్