మెగాస్టార్ తల్లి ఆరోగ్యం బాగానే ఉంది – అసత్య ప్రచారంపై చిరంజీవి టీమ్ క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారంటూ ఉదయం నుంచి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలోని అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్కు వెళ్లారని వార్తలు వచ్చాయి.

అయితే, ఈ వార్తలపై చిరంజీవి టీమ్ స్పష్టత ఇచ్చింది. అంజనాదేవి అస్వస్థత గురించి వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదని, కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తమే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో అనవసరంగా వైరల్ అవుతున్న రూమర్లపై మెగా ఫ్యామిలీ స్పందిస్తూ, తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది.