అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారీఫ్లు విధించిన అధ్యక్షుడు ట్రంప్ అత్యధికంగా కంబోడియాపై 49 శాతం వరకు పన్నులు విధించారు. భారత్పై 26 శాతం, చైనాపై 34 శాతం, ఐరోపా దేశాలపై 20 శాతం వరకు సుంకాలు విధించారు. దీంలో అమెరికా విధించిన టారిఫ్లపై చైనా సీరియస్గా స్పందించి ప్రతీకార సుంకాలు ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు మాత్రమే విధించే ఈ టారిఫ్లు ఈ నెల 9 నుంచే అమల్లోకి వస్తాయని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది.చైనా ప్రతీకార సుంకాలపై ట్రంప్ స్పందించారు . చైనా భయపడింది తప్పు నిర్ణయం తీసుకుంది. మరో మార్గం లేకే ఈనిర్ణయం తీసుకుందని తప్పుబట్టారు ట్రంప్. చైనాకు మరోమారు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అమెరికాపై విధించిన 34 శాతం ప్రతీకార సుంకాలను వెంటనే రద్దు చేయాలని చెప్పారు. 24 గంటల్లో ప్రతీకార సుంకాలను రద్దు చేయకుంటే చైనాపై అదనంగా 50 శాతం టారిఫ్స్ విధిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయం ఈ నెల 9 నుంచి అమలులోకి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో ఓ పోస్టు పెట్టారు.
బ్లాక్ మెయిలింగ్
చైనాపై ప్రతీకార సుంకాలు విధించడం ఏకపక్షమని, రెచ్చగొట్టే చర్యలని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడుకునేందుకు చైనా ఈ చర్యలు తీసుకుందని తెలిపింది. సాధారణ అంతర్జాతీయ వాణిజ్య క్రమాన్ని కొనసాగించేందుకు ఉద్దేశించిన పూర్తిగా చట్టబద్ధమైన చర్య అని చైనాపై సుంకాలు పెంచుతామని అమెరికా బెదిరించడం తప్పు అని పేర్కొంది. ఇది మరోసారి అమెరికా బ్లాక్ మెయిలింగ్ వైఖరిని బహిర్గతం చేసిందని దీన్నీ చైనా ఎప్పటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు.

బెదిరింపులకు భయపడం
ఆయా దేశాలపై అమెరికాపై ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయని,అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు ట్రంప్.దాంతో భారత్ సహా అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు పెరిగాయి. ట్రంప్ సుంకాలను సద్వినియోగం చేసుకుంటూ రాబోయే కాలంలో ప్రపంచ మార్కెట్కు ప్రత్యామ్నాయ ఛాంపియన్ గా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రక్షకుడిగా నిలవాలని చైనా ఆలోచిస్తున్నది. ప్రపంచ దేశాల శ్రేయస్సు తనపైనే ఆధారపడి ఉందనే సందేశాన్ని పంపాలనుకుంటున్నది. అమెరికాతో పోలిస్తే చైనా సైతం స్థిరమైన ఆర్థిక భాగస్వామిగా ప్రపంచ దేశాలకు చూపించాలనుకుంటున్నది.ఈ క్రమంలో ట్రంప్ సుంకాల విషయంలో యూఎస్తో చైనా ఢీ అంటే ఢీ అంటున్నది. అమెరికా బెదిరింపులకు తాము భయపడమని ఈ తరహా, ఒత్తిడి, బెదిరంపులు మంచిది కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యుని మీడియా ట్రంప్ డెడ్లపై ప్రశ్నించింది. దీనికి పెంగ్యు స్పందిస్తూ, ట్రంప్ టారిఫ్ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోమని చైనా స్పష్టం చేసింది.చైనా తన చట్టబద్ధమైన హక్కులతో పాటు ప్రయోజనాలను కాపాడుకుంటుందన్నారు.
Read Also: Markets: తేరుకున్న ప్రపంచ మార్కెట్లు