Center is doing injustice to Telangana MLC Kodandaram

తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది : ఎమ్మెల్సీ కోదండరాం

మీరు మౌనం వహించడం వల్లే.. ఈరోజు ఈ పరిస్థితి

హైదరాబాద్‌: కృష్ణా జలాలపై తెలంగాణ , ఏపీ మధ్య జరుగుతున్న చర్చలు.. దానిపై కేంద్రం స్పందనపై ఎమ్మెల్సీ కోదండరాం స్పందించారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఉద్యమానికి మూల కారణాలైన వాటిలో నీళ్ళ పంపకం ఒకటి అన్నారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని కోదండరాం మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కృష్ణా జలాల నీటి వివాదంపై గత పదేళ్ళు అధికారంలో ఉండి కూడా ఒక్క మాట మాట్లాడకుండా ఉన్నారు.

Advertisements
తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది

టీజేఎస్ తరపున గట్టిగానే నిలదీస్తాం

ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి తాము పోరాటం చేస్తామని ముందుకు రావడం హాస్యాస్పదం అన్నారు. గత పదేళ్లలో మీరు మౌనం వహించడం వల్లే.. ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎనికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, టీజేఎస్ తరపున గట్టిగానే నిలదీస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీజేఎస్ మద్దతు కోరిందని కోదండరాం మీడియాకు తెలియజేశారు.

ఇటీవలే కృష్ణా నది యాజమాన్య బోర్డు ఫిర్యాదు

కాగా, ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే కృష్ణా నది యాజమాన్య బోర్డు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం బోర్డు సమావేశం కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ.. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఆర్ఎంబీ కి లేఖ రాశారు.

Related Posts
విడుదల 2 మూవీ రివ్యూ
విడుదల 2 మూవీ రివ్యూ

విడుదల 2 ప్రేక్షకులకు ఒక భావోద్వేగ రాజకీయ సందేశం విడుదల 2 మూవీ రివ్యూ: విజయ్ సేతుపతి చిత్రం ఒక బలమైన రాజకీయాలను ముందుకు తెస్తుంది రాజకీయాలను Read more

తెలంగాణ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ ను వాడేశారు
powerbill

తెలంగాణలో వేసవి ఇంకా ప్రారంభమవ్వకముందే విద్యుత్ వినియోగం రికార్డులు తిరగరాస్తోంది. రాష్ట్ర ప్రజలు 16,293 మెగావాట్ల విద్యుత్ను వినియోగిస్తూ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించారు. ఇటీవల ఫిబ్రవరి Read more

ఏపీ ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియామకం
praveen aditya appointed as

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్‌లో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేయడం, ఎండీ దినేశ్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం జీఏడీకి Read more

Medaram jatara: మేడారం జాతరకు వెళ్లి అదృశ్యమైన వ్యక్తి మృతి
Medaram jatara: మేడారం జాతరకు వెళ్లి అదృశ్యమైన వ్యక్తి మృతదేహం అడవిలో లభ్యం

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారం మినీ జాతరలో జరిగిన విషాదకర ఘటన స్థానికులను, భక్తులను విషాదంలో ముంచింది. భక్తితో వచ్చిన వ్యక్తి కారడవిలో దారితప్పి మృత్యువాతపడడం Read more

×