High tension in Tirupati.. Bhumana under house arrest!

Bhumana Karunakar : తిరుపతిలో హైటెన్షన్..భూమన హౌస్ అరెస్ట్ !

Bhumana Karunakar : తిరుపతిలో హైటెన్షన్ నెలకొంది. టీటీడీ గోశాల అంశంలో టీడీపీ, వైసీపీ మధ్య పరస్పర సవాళ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. దీంతో భూమన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. తిరుమల గోశాలలో వందల ఆవులు మరణించాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ ఆరోపించారు.

Advertisements
తిరుపతిలో హైటెన్షన్ భూమన హౌస్

ర్యాలీగా వెళ్లవద్దు.. గన్‌మెన్‌లతో మాత్రమే సందర్శించాలి

ఇది అసత్య ప్రచారమని, ఆధారాలు బయటపెట్టాలని టీటీడీ సవాల్ చేసింది. ఈ క్రమంలోనే వైసీపీ తిరుమల గోశాల శాంతిర్యాలీకి పిలుపునిచ్చింది. అయితే ర్యాలీకి అనుమతి లేదని తిరుపతి పోలీసులు తెలిపారు. ర్యాలీగా వెళ్లవద్దని గన్‌మెన్‌లతో మాత్రమే సందర్శించాలని భూమనకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసుల భారీగా మోహరించారు. అయితే భూమన హౌస్ అరెస్ట్ చేశారని పలువురు వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.

తిరుమల తిరుపతి లో ఎటు చూసిన టెన్షన్ వాతావరణం

ఈ ప్రచారంపై స్పందించిన పోలీసులు తాము ఎవరినీ హౌస్ అరెస్ట్ చేయలేదని తేల్చి చెప్పారు. దీంతో తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక హౌస్ అరెస్ట్ డ్రామా ఆడుతున్నారని టీడీపీ విమర్శించారు. ప్రస్తుతం ఆధ్యాత్మిక నగరం అయిన తిరుమల తిరుపతి లో ఎటు చూసిన టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఈ రోజు కూటమి నేతలు టీటీడీకి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించాలని పిలుపు నిచ్చారు.

Read Also: టీడీపీ ఛాలెంజ్ స్వీకరించిన భూమన

Related Posts
Mayonnaise : స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్ తెలిపిన తమిళనాడు ప్రభుత్వం
Mayonnaise

స్ట్రీట్ ఫుడ్ అభిమానులకు తమిళనాడు ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యువతను ఆకట్టుకునే మయోనైజ్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. మయోనైజ్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదం Read more

హైదరాబాద్‌లోని HICCలో టాప్ 3 వీడియో గేమింగ్ డెవలపర్ ప్రారంభం
Launch of Top 3 Video Gaming Developer at HICC Hyderabad

గేమింగ్ డెవలపర్‌లు, గేమింగ్ స్టూడియోలు, పరిశ్రమ నిపుణులు మరియు గేమింగ్ ఔత్సాహికులతో సహా 6000+ మంది పాల్గొనేవారు IGDC 2024 మొదటి రోజున కలుసుకున్నారు.. హైదరాబాద్‌: గేమ్ Read more

టెక్ సదస్సులో ప్రసంగించనున్న కేటీఆర్‌
KTR to address the tech conference

పెట్టుబడిదారులు, వివిధ ప్రభుత్వాలు ప్రతినిధులతొ చర్చలు.హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను బెంగళూరులో ఈనెల 27, 28 తేదీల్లో ఎంట్రప్రెన్యూర్‌ ఇండియా నిర్వహించే టెక్‌ అండ్‌ Read more

Operation Sindoor : పాక్ లోని స్థావరాలపై విరుచుకుపడిన భారత్
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌లో 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి

ఆపరేషన్ సిందూర్ ఆపరేషన్ సిందూర్ వివరాలను బుధవారం న్యూఢిల్లీలో మీడియాకి వెల్లడిస్తున్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ. చిత్రంలో కల్నల్ సోఫియా ఖురేషి, ఐఎఎఫ్ వింగ్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×