Latest Telugu news : The classroom – తరగతిగదిలోనే దేశ భవితకు పునాది

Read Time:  1 min
The classroom - తరగతిగదిలోనే దేశ భవితకు పునాది
The classroom - తరగతిగదిలోనే దేశ భవితకు పునాది
FONT SIZE
GET APP

తరగతిగదిలో (The classroom)పాఠాలు చెప్పడమంటే ఒక తరం తలరాతను రాయడం. ఒక దేశ భవితకు పునాది (foundation)వేయడం. చిన్నారులకు మంచేదో చెడేదో చెబుతూ విద్యార్థుల వ్యక్తిత్వానికి విలువల వన్నెలద్దడం గురువులు చేసే పని. పేదకుటుంబాల చిన్నారులకు ఫీజులు కట్టి పుస్తకాలు కొనిచ్చే మాస్టార్లు, వ్యక్తిగత శ్రద్ధతో వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థులను సానపట్లే టీచర్లూ గణనీయంగానే ఉన్నారు. సమానత్వం, లౌకికవాదం వంటి రాజ్యాంగ విలువల గురించి చెబుతూ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సింది వారే. ఆరోగ్యకరంగా, గౌరవప్రదంగా, స్వేచ్ఛగా ఎదిగేందుకు చిన్నారులకు అన్ని అవకాశాలూ, సదుపాయాలూ కల్పించాల్సింది రాజ్యమేనని 39(ఎస్) రాజ్యాంగ అధికరణ స్పష్టంగా చెబుతోంది. ఇందుకు అనుగుణంగా సర్కారు బడుల్లో పిల్లలకు అటువంటి సురక్షిత వాతావరణం కల్పించవలసింది ఉపాధ్యాయులు. ఓర్పుగా నేర్పుతో పాఠాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడంఉపాధ్యాయులు విద్యుక్త ధర్మం. ఇందుకు ఒక్కో ఉపాధ్యాయుడిది ఒక్కోశైలిలో బోధన ఉంటుంది. ఆ శైలి విద్యార్థులకు అర్ధమయ్యేలా ఉండాలి. శరవేగంగా మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా పాఠశాలల స్వరూపం, ఉపాధ్యాయుల బోధనతీరును సంస్కరించవలసిన అవసరముంది. ప్రస్తుత విద్యావ్యవస్థ విద్యార్థు లను ఏళ్ల తరబడి ఓ మూస విధానంలో నడిపిస్తూ అందరినీ ఒకే తరహాలో ఉండే నమూనాలుగా తయారు చేస్తోంది.

The classroom  -  తరగతిగదిలోనే దేశ భవితకు పునాది
The classroom – తరగతిగదిలోనే దేశ భవితకు పునాది


తరగతిగది (The classroom)అనేది విద్యార్థులు ఏంనేర్చుకోవాలో బోధిం చేదికాదు. తమంతట తాము తెలుసుకోడానికి ప్రోత్స హిస్తూ తమ ఆసక్తులను గుర్తెరిగి వాటిని ఎలా పెంపొందించుకోవా లో తెలియజేసే మార్గదర్శిలా ఉండాలి. ఈమేరకు జాతీయ విద్యావిధానం 2020 ప్రతిపాదించినట్లుగా విద్యా సంస్కర ణలు జరగాలి. పిల్లల మానసిక వికాసం పెంపొందించేలా మూడేళ్లలోపు చిన్నారుల విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. ప్రాథమిక స్థాయి తరగతుల (The classroom)బోధన ప్రధానంగా చదవడం, రాయడంపైన ఉంటుంది. పరిశీలన, అవగాహన, సృజనాత్మ కత, ఆలోచనాత్మకత వంటి విష యాలు చదవడం, రాయ డం ద్వారా అబ్బుతుంది. ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రధానంగా దోహదపడుతారు. తరగతి గదిలో లేదా ఇంటి వద్ద తగినన్ని కథల పుస్తకాలు, పోస్టర్లు, మ్యాగజైన్లు, వార్తా పత్రికలు, న్యూస్ లెటర్లు, బొమ్మలతో కూడిన వ్యా ఖ్యానాలువంటి సామాగ్రి ద్వారా చదుకోవాలనే వాతావరణం కల్పించడం ఎంతో అవసరం. ఇదికాస్త అనుభవాత్మక అభ్య సన వైపు మళ్ళిస్తుంది. వినడం, మాట్లాడం, చదవడం, రాయడం ప్రధానాంశంగా ప్రాథమిక విద్యా ప్రామాణికల పట్టికలో చేర్చిన విషయం తెలిసిందే. పిల్లల అభ్యసనా ప్రక్రియలో తల్లిదండ్రుల పాత్ర ప్రధానమైనది. చిన్నారులు తమ చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ, ఎలా ప్రతి స్పందిస్తున్నారనే అంశాన్ని అధ్యయనం చేయాలి. ఈ సామర్థ్యం పెంపొందేలా విద్య ఉండాలి. ముఖ్యంగా దృశ్యశ్రవణ మాధ్యమాలకు స్పందన ఎలా ఉందనే విషయాన్ని గమనం లోకి తీసుకోవాలి. పర్యావరణానికి నష్టం కలిగించే పాలిథిన్ను పక్కనపెట్టి వస్త్రం, తోలు, కాగితంలో పిల్లల చెంతే ప్రయోగశాలను తలపించే బొమ్మలు రూపొందించాలి. రకరకాలైన తోలు బొమ్మలను తయారు చేస్తూ ఆహ్లాదకర వాతావరణంలో పాఠాలు బోధించాలి. చదువు పుస్తకాలకు పరిమితం కాకుండా, ఆటపాటల ద్వారా అక్షర జ్ఞానాన్ని, పరిసరాలపై అవగాహనను ఏర్పరచే ప్రయత్నం జరగాలి. ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు నిచ్చెనలా తోడ్పడాలి.
-ఎస్.సీతారామయ్య

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి?

ఉపాధ్యాయులు సమాజంలో బహుళ కీలక పాత్రలను పోషిస్తారు, వారిలో విద్యావేత్త, గురువు, రోల్ మోడల్, కౌన్సెలర్ మరియు సమాజ నిర్మాత ఉన్నారు. వారు జ్ఞానాన్ని అందించడం, విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడం, జీవితాంతం నేర్చుకోవడాన్ని ప్రోత్సహించడం మరియు సంస్కృతిని కాపాడటం వంటి బాధ్యతలను కలిగి ఉంటారు.

బోధనా పద్ధతులు ఎన్ని?

బోధనా పద్ధతుల్లో విభిన్న బోధన, ఉపన్యాస ఆధారిత బోధన, సాంకేతికత ఆధారిత అభ్యాసం, సమూహ అభ్యాసం, వ్యక్తిగత అభ్యాసం, విచారణ ఆధారిత అభ్యాసం, కైనెస్థెటిక్ అభ్యాసం, ఆట ఆధారిత అభ్యాసం మరియు సాహసయాత్ర అభ్యాసం ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.