New Recharge: జియో, ఎయిర్ టెల్(Airtel) వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ టారిఫ్ లను పెంచుతూ, కనీస రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరిస్తున్న ప్రస్తుత తరుణంలో, ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారులకు శుభవార్తను తెలిపింది. కేవలం రూ.147లకే నెల రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది.
30 రోజులు వ్యాలిడిటీ
సామాన్యులను దృష్టిలో ఉంచుకుని అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్ను మార్కెట్లోకి విడుదల చేసింది బిఎస్ఎన్ఎల్. రూ 147 తో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు 30రోజుల వ్యాలిడిటీ(Validity) లభిస్తుంది. ఈనెల రోజుల పాటు దేశంలోని ఏ నెట్వర్క్ కైనా అపరిమితంగా వాయిస్ కాల్స్
సౌకర్యం ఉంటుంది. దీంతోపాటు 10 జీబీ హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తున్నారు. రోజుకు సుమారు ఐదు రూపాయల ఖర్చుతో వినియెగదారులు ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

ఇంటర్నెట్ వేగాన్ని తగ్గిస్తుంది
ఈ ప్లాన్లో ఒక పరిమితి ఉంది. కేటాయించిన 10జీబీ డేటా వినియోగం పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 కేజీపీఎస్ కు తగ్గిపోతఉుంది. అందువల్ల, అధికంగా ఇంటర్నెట్ వాడే వారికి ఈ ప్లాన్ అంతగా సరిపోకపోవచ్చు. కానీ, ప్రధానంగా వాయిస్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ, పరిమితంగా డేటా వాడేవారికి ఈ ప్లాన్ అంతగా సరిపోకపోవచ్చు. కానీ, ప్రధానంగా వాయిస్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ, పరిమితంగా డేటా వాడే వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ గా నిలుస్తుంది. పెరుగుతున్న రీఛార్చ్ ధరల నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది ఈ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
ఈ ప్లాన్ ఎవరికి ఎక్కువగా ఉపయోగకరం?
ఎక్కువగా వాయిస్ కాల్స్ చేసే, పరిమితంగా డేటా వాడే వినియోగదారులకు ఈ ప్లాన్ చాలా సరిపోతుంది.
ఈ ప్లాన్ ఎందుకు ప్రత్యేకం?
జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలు ధరలు పెంచుతున్న సమయంలో, తక్కువ ధరలో మంచి సౌకర్యాలు ఇవ్వడం వల్ల ఈ ప్లాన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :