నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) ఫ్లాట్గా, స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, దేశీయంగా మార్కెట్ తీవ్ర ఊగిసలాటను చవిచూస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 74 పాయింట్ల లాభంతో 82,446 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 27 పాయింట్ల లాభంతో 25,131 వద్ద ఉన్నాయి. ఎంఅండ్ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎటర్నల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, బజాజ్ఫిన్సర్వ్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కోటక్మహీంద్రా బ్యాంక్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా, టీసీఎస్, అదానీ పోర్ట్స్, ఎల్అండ్టీ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 85.48 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 66.75 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,359 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్గా
అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. నాస్డాక్ 0.63 శాతం, ఎస్ అండ్ పీ 500.. 0.55 శాతం, డోజోన్స్ 0.25 శాతం లాభపడింది. ఆసియా మార్కెట్లు నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. జపాన్ నిక్కీ 0.45 శాతం, ఆస్ట్రేలియన్ ఏఎస్ఎక్స్ 0.28 శాతం, హాంగ్సెంగ్ 0.87 శాతం, షాంఘై 0.47 శాతం లాభంతో కదలాడుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) వరుసగా మూడో రోజు కొనుగోలు దారులుగా నిలిచారు. మంగళవారం నికరంగా రూ.2,302 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా.. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.1,113 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఈ నెలలోనే భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం (Interim Trade Deal) జరిగే అవకాశం ఉంది. ఇది బిలటీల స్థాయిలో మరింత చురుకుదలకి దారితీయొచ్చు.