దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు గురువారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 72 పాయింట్ల లాభంతో 82,596 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 30 పాయింట్ల లాభంతో 25,172 వద్ద ఉన్నాయి. మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైనా కొంత లాభాల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
ఏషియన్ పెయింట్స్, బజాజ్ఫిన్సర్వ్, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, ఎటర్నల్, టెక్మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, ఐటీసీ, టీసీఎస్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 85.46 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 69.35 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,394.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

విదేశీ & దేశీయ మదుపర్ల లావాదేవీలు
అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. నాస్డాక్ 0.50 శాతం, ఎస్ అండ్ పీ 500.. 0.27 శాతం నష్టపోగా.. డోజోన్స్ మాత్రం ఫ్లాట్గా ముగిసింది. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.71 శాతం, హాంగ్సెంగ్ 0.60 శాతం, షాంఘై 0.04 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. ఆస్ట్రేలియన్ ఏఎస్ఎక్స్ మాత్రం 0.22 శాతం లాభంతో ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా రూ.446 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.1,585 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైనప్పటికీ, స్థిరతగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్పష్టత లేమి ఉండటం వల్ల మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మార్కెట్కు బలాన్నిస్తుండగా, రూపాయి స్థిరంగా కొనసాగుతోంది.
Read Also: Edible Oil: ముడి వంట నూనెలపై కస్టమ్స్ సుంకం తగ్గింపు