📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్

Murder: ఆస్తి కోసం కూతురును చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి

Author Icon By Vanipushpa
Updated: April 12, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కు చెందిన పీనా నాయక్‌కు 30 ఏళ్ల కింద వివాహం అవ్వగా ఒక కూతురు, ఒక కుమారుడు.. 2003లో విడాకులు తీసుకున్నప్పటి నుండి కూతురు మహేశ్వరి తండ్రి దగ్గరే పెరిగింది.
అనంతరం 2003లోనే పీనా నాయక్‌, లలిత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.. ఈమెకు ఒక కూతురు ఉంది.. కూతురు మహేశ్వరి బీఎస్సీ నర్సింగ్ చేసి, ప్రైవేట్ ఉద్యోగం చేసింది.
అక్కడ పరిచయం అయిన యువకుడిని మహేశ్వరి పెళ్లి చేసుకోగా, కొంతకాలానికి విబేధాల తో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.. ఆ తర్వాత కూతురు మహేశ్వరి రెండో వివాహం కోసం తండ్రి భారీగా డబ్బు ఇవ్వాలని అనుకున్నాడు.

మహేశ్వరిని చంపాలని పథకం
బోడుప్పల్ లో తనకున్న రెండు ఇండ్లలో ఒకటి మహేశ్వరికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు.. దీంతో ఆస్తి పోతుందని సవతి తల్లి లలిత, తన మరిది సీఆర్పీఎఫ్ జవాన్ బానోత్ రవి, అతడి స్నేహితుడు వీరన్న కలిసి మహేశ్వరిని చంపాలని పథకం వేశారు. గతేడాది డిసెంబర్ 7న ఉద్యోగ పనులపై పీనా నాయక్ బయటకు వెళ్లిన సమయం చూసి ఈ ముగ్గురు మహేశ్వరిని చంపి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి వద్ద మూసి నదిలో పూడ్చి పెట్టారు. పీనా నాయక్ తిరిగి ఇంటికి రాగానే కూతురు వేరే అతనితో వెళ్లిపోయిందని, ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని భార్య లలిత నమ్మించింది.. దీంతో మౌనంగా ఉన్న పీనా నాయక్ 4 నెలలవుతున్నా కూతురు జాడ తెలియకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసుల విచారణలో మహేశ్వరిని ఆస్తి కోసం చంపినట్టు అంగీకరించగా, ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read Also: Reservoirs : అడుగంటుతున్న ప్రాజెక్టులు

#telugu News and buries her in river for property Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Stepmother kills daughter Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.