హైదరాబాద్ Sports : ఫోర్త్ సిటీలో (Fourth City) అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు క్రీడా, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సిఎం రేవంత్రెడ్డి స్పోర్ట్స్ పాలసీని త్వరలోనే ప్రవేశపెట్ట నున్నారని పేర్కొన్నారు. ప్రఖ్యాత భారత క్రికెటర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సయీద్ కిర్మాణీ ఆత్మకథ స్టంప్డ్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రఖ్యాత క్రికెటర్ సయీద్ కిర్మాణీ ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించిన క్రీడల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, టీమ్ ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్తో పాటు పలు క్రీడా ప్రముఖలు హాజరయ్యారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ 1983 వరల్డ్ కప్ విజయం తనకు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకమని, చిన్నప్పుడు ఎల్బీ స్టేడియంలోనే క్రికెట్ నేర్చుకున్నానని అన్నారు. హైదరాబాద్ నుంచి భారత క్రెకెట్లో మహ్మద్ సిరాజ్ ఒక గొప్ప ఐకాన్ గా నిలిచారని ప్రశంసించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడం సిఎం లక్ష్యం అని మంత్రి వివేక్ తెలిపారు.
క్రికెట్లో (Cricket) ఆపారసేవలందించిన సయీద్ కిర్మాణీ జీవితంలోని విశేషాలను, అనుభవాలను స్టంప్డ్ పుస్తకంలో ఆవిష్కరించారు. ఈ పుస్తక ఆవిష్కరణకు హాజరైన అతిథులు కిర్మాణీ కృషిని, క్రీడా స్పూర్తిని కొనియాడారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :