Sreeja Varma: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థిని మృతి

Read Time:  1 min
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థిని మృతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థిని మృతి
FONT SIZE
GET APP

అమెరికా(America)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌‍(Hyderabad)కు చెందిన విద్యార్థిని శ్రీజ వర్మ(Sreeja Varma) దుర్మరణం చెందింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఆమె తన అపార్ట్‌మెంట్ నుంచి భోజనం కోసం కారులో రెస్టారెంటుకు వెళ్లింది. తిరిగి వస్తుండగా కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె స్నేహితురాలు కూడా కారులో ఉన్నట్లు సమాచారం. శ్రీజ వర్మ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసింది.

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థిని మృతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థిని మృతి

శ్రీనివాస్ వర్మ డ్రైవర్‌గా పని చేస్తుండగా..

సిద్దిపేట జిల్లా రామారుకల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు శ్రీజ వర్మ, శ్రేయ వర్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. వారు మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని శ్రీకృష్ణనగర్‌లో నివాసముంటున్నారు. శ్రీనివాస్ వర్మ డ్రైవర్‌గా పని చేస్తుండగా, ఆయన భార్య ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. చిన్నకూతురు శ్రేయా వర్మ కూడా ఎంఎస్ చేసేందుకు 20 రోజుల క్రితం అమెరికా వెళ్లింది.

ట్రాఫిక్ ఘర్షణలు

ట్రాఫిక్ ఘర్షణలు తరచుగా గాయం , వైకల్యం , మరణం మరియు ఆస్తి నష్టంతో పాటు సమాజానికి మరియు వ్యక్తులకు ఆర్థిక ఖర్చులకు దారితీస్తాయి. రోడ్డు రవాణా అనేది గణాంకపరంగా ప్రజలు రోజువారీగా..

Read hindi news:hindi.vaartha.com

Read also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.