📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

GST collections: ఏప్రిల్‌లో రికార్డు స్థాయి లో జీఎస్టీ వసూళ్ల ఆదాయం

Author Icon By Vanipushpa
Updated: May 2, 2025 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఒక పెద్ద వార్త వెలువడింది. ఏంటంటే ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు ఎన్నడూ లేని విధంగా కొత్త రికార్డు సృష్టించి, అత్యధిక స్థాయిలో రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే గత ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.2.10 లక్షల కోట్ల కంటే ఈ వసూళ్లు 12.6 శాతం ఎక్కువ. నిన్న గురువారం అఫీషియల్ డేటా ప్రకారం, ఏప్రిల్ 2024లో GST ఆదాయం రూ.2.10 లక్షల కోట్లుగా ఉంది, దీని బట్టి చూస్తే 1 జూలై 2017న కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రెండవ అత్యధిక వసూళ్లు. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశీయ లావాదేవీల నుండి GST వసూళ్లు 10.7 శాతం పెరిగి రూ.1.9 లక్షల కోట్లకు చేరుకుంది, దీనితో పాటు దిగుమతి చేసుకున్న వస్తువుల నుండి వచ్చే ఆదాయం 20.8 శాతం పెరిగి రూ.46,913 కోట్లకు చేరుకుంది.

రీఫండ్స్‌లో 48% పెరుగుదల
ఏప్రిల్‌లో జారీ చేసిన రీఫండ్ మొత్తం 48.3 శాతం పెరిగి రూ.27,341 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో GST వసూళ్లు 9.9 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి, ఈ మొత్తం అత్యధిక ఆర్థిక కార్యకలాపాలు ఇంకా మెరుగైన అభివృద్ధి చూపిస్తుంది. వరుసగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన రూ.1.84 లక్షల కోట్ల ఆదాయం కంటే జిఎస్‌టి వసూళ్లు 6.8 శాతం ఎక్కువగా ఉన్నాయి. మార్చి నెలలో గ్రాస్ జీఎస్టీ ఆదాయంలో సెంట్రల్ జీఎస్టీ నుండి రూ.38,100 కోట్లు, స్టేట్ జీఎస్టీ నుండి రూ.49,900 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుండి రూ.95,900 కోట్లు, కాంపెన్సేషన్ సెస్ నుండి రూ.12,300 కోట్లు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో చూస్తే సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.35,204 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.43,704 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.90,870 కోట్లు, కాంపెన్సేషన్ సెస్ రూ.13,868 కోట్లు.
జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర టాప్
మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. మహారాష్ట్ర మార్చిలో రూ.31,534 కోట్లు చెల్లించింది, గత ఏడాది మార్చి కంటే 14 శాతం ఎక్కువ. అదే సమయంలో కర్ణాటక రూ. 13,497 కోట్లు చెల్లించింది, ఈ మొత్తం వార్షిక ప్రాతిపదికన 4 శాతం పెరుగుదల చుపిస్తుంది. ఇక గుజరాత్ రూ.12,095 కోట్లు అందించింది, మార్చి 2024 నుండి 6 శాతం పెరుగుదల. తమిళనాడు రూ.11,017 కోట్లు చెల్లించింది, ఇది కూడా 7 శాతం పెరుగుదల, ఉత్తరప్రదేశ్ రూ.9,956 కోట్లు వసూలు చేసింది, గత సంవత్సరంతో పోలిస్తే 10 శాతం పెరుగుదల.

Read Also: Pahalgam Terror Attack: ఉగ్రవాదులను వేటాడి చంపుతాం: అమిత్ షా

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu GST revenue collection hits record high in April Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.