📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Stock Markets: భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Author Icon By Vanipushpa
Updated: May 27, 2025 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) తీవ్ర నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల(International Markets) నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, ముఖ్య రంగాలలో షేర్ల(Shares) లో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపించాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడటంతో పాటు, కీలక రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫలితంగా, రెండు రోజుల పాటు కొనసాగిన లాభాలకు తెరపడింది. నిఫ్టీ సూచీ తిరిగి 24,850 స్థాయి దిగువకు పడిపోయింది.

Stock Markets: భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది
సెన్సెక్స్ ఉదయం 82,038 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. ఆరంభమైన కొద్దిసేపటికే సూచీ భారీ నష్టాల్లోకి జారుకుంది. అయితే, ఆ తర్వాత కాస్త కోలుకుని లాభాల్లోకి ప్రవేశించి, 82,410 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మదుపరులు ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ అమ్మకాల హోరు మొదలైంది. దీంతో సూచీ ఏకంగా 81,121 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది.
తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన సెన్సెక్స్
రోజంతా తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన సెన్సెక్స్, చివరికి 624 పాయింట్ల నష్టంతో 81,551 వద్ద స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ కూడా 174 పాయింట్లు కోల్పోయి 24,826 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ సుమారు 1,300 పాయింట్ల పరిధిలో కదలాడటం గమనార్హం. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడింది. రూపాయి 27 పైసలు క్షీణించి రూ. 85.37 వద్ద ముగిసింది. ఈరోజు మార్కెట్లలో అధిక ఊగిసలాట కనిపించింది. మొదట లాభాల్లోకి వెళ్లిన సూచీలు చివరికి భారీ నష్టాల్లో ముగిశాయి. రూపాయి బలహీనత, అంతర్జాతీయ అనిశ్చితి, సాంకేతికంగా కీలక స్థాయిలను నిఫ్టీ దిగువన బ్రేక్ చేయడం తదితర అంశాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి.

Read Also: BYJU’S : గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘బైజూస్’ తొలగింపు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Domestic stock markets Google News in Telugu Latest News in Telugu Paper Telugu News suffered heavy losses Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.