Andhra Pradesh: ఏపీలో జపాన్ ప్రొటీరియల్ భారీ పెట్టుబడి

Read Time:  1 min
Andhra Pradesh: ఏపీలో జపాన్ ప్రొటీరియల్ భారీ పెట్టుబడి
FONT SIZE
GET APP

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల రంగానికి మరో కీలక పెట్టుబడి రానుంది. జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థ ప్రొటీరియల్ రాష్ట్రంలో తన తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు ముందుకు వచ్చింది. తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Read Also:Janasena Office Attack Mangalagiri: జనసేన పార్టీ కార్యాలయంపై దాడి

Andhra Pradesh
Andhra Pradesh: Japan’s Protereal invests heavily in AP

ఈ యూనిట్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో ఉపయోగించే అమోర్ఫస్ మెటల్‌ను ఉత్పత్తి చేయనున్నారు. మొదటి దశలో సుమారు 77 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడిని పెట్టనున్నారు. ప్లాంట్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత సంవత్సరానికి దాదాపు 30 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

జపాన్, అమెరికా దేశాల తర్వాత అమోర్ఫస్ మెటల్ ఉత్పత్తికి ఏర్పడుతున్న మూడో తయారీ కేంద్రంగా ఇది నిలవడం ప్రత్యేకతగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా సృష్టించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.