📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telanagana: సరస్వతి నది పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ గవర్నమెంట్

Author Icon By Anusha
Updated: April 16, 2025 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణంలో సరస్వతీ నది పుష్కరాలు నిర్వహించేందుకు రేవంత్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. ఈ పుష్కరాలకు సంబంధించిన పోస్టర్‌, వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ను మంత్రులు ఆవిష్కరించారు. పుష్కరాలకు నిత్యం 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా.పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాల ని సూచన చేసారు. అదే విధంగా భక్తులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంచేందుకు యాప్ తో పాటుగా వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. అదే విధంగా పుష్కరాల కోసం వచ్చే భక్తుల కోసంటెంట్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు.తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి. వచ్చే నెల మే 15 నుంచి 26వ తేదీ వరకు ఈ పుష్కరాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యం సరస్వతి పుష్కరాల వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించిన శాఖ మంత్రి కొండా సురేఖ పోస్టర్‌ను విడుద చేశారు. పుష్కరాల యాప్‌ను మంత్రి శ్రీధర్ బాబు విడుదల చేశారు. గత ప్రభుత్వం యాదగిరి గుట్ట మినహా మిగతా దేవాలయాలను నిర్లక్ష్యం చేసిందంటూ బీఆర్ఎస్ నేతలపై సురేఖ మండి పడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేవాలయాల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. రూ. వంద కోట్లు దాటిన ఆలయాలను పాలక మండలి కిందకు తీసుకువస్తామని ప్రకటించారు.

ప్రత్యేక హోమాలు

సరస్వతి పుష్కరాల కోసం రూ. 35 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. ఇక 17 అడుగుల సరస్వతి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులపాటు కాశీ నుంచి వచ్చిన పండితులతో ప్రత్యేక హోమాలు, హారతి నిర్వహిస్తామని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు పుష్కరాల ఏర్పాట్లను వివరించారు. తెలంగాణలో కాళేశ్వరం త్రివేణి సంగమని గుర్తు చేశారు. గోదావరి, ప్రాణహితతో కలిసి సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని వివరిం రు. 2013లో సరస్వతి పుష్కరాలు జరిగాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సారి కూడా ఈ పుష్కరాలను చాలా గొప్పగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గురువు మిధున రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ సరస్వతి పుష్కరాలు వస్తాయన్నారు.

ప్రభుత్వం అంచనా

ఈ పుష్కరాలకు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా భక్తులు తరలి వస్తారన్నారు. ప్రతీ రోజు లక్ష మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుందని చెపారు. ఈ పుష్కరాల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ. 35 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ పుష్కరాల కోసం వచ్చేసే భక్తుల కోసం వంద పడకల టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కాశీ నుంచి వచ్చే పురోహితులతోపాటు స్థానిక పురోహితులు కలిసి ప్రత్యేక హారతి, హోమాలు నిర్వహి రని వెల్లడించారు. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 12 రోజులపాటు కాశీ నుంచి వచ్చే పండితులతో ప్రత్యేక హోమాలు, హారతులు నిర్వహించనున్నారు.

Read Also: Telanagana:దశల వారీగా వందే భారత్ రైళ్లకు కసరత్తు

#RiverPushkaralu2025 #SaraswatiPushkaralu #SaraswatiRiverFestival #TelanganaDevotional #TelanganaPushkaralu Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.