📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

PM Modi : ఎలాన్‌ మస్క్‌తో ప్రధాని మోడీ ఫోన్‌లో చర్చలు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 18, 2025 • 3:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

PM Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలోని డోజ్‌ విభాగ అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని మోడీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌తో పలు అంశాలపై మాట్లాడా. ఈ ఏడాది ఆరంభంలో వాషింగ్టన్‌లో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలనూ మేం ప్రస్తావించాం. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించాం. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్‌ కృతనిశ్చయంతో ఉంది అని మోడీ రాసుకొచ్చారు.

image

టెక్నాలజీ వంటి రంగాలపై వీరిద్దరూ చర్చలు

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని టెస్లా, స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సంస్థలు భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వేళ వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిబ్రవరిలో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రధానితో మస్క్‌ భేటీ అయ్యారు. అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ వంటి రంగాలపై వీరిద్దరూ చర్చలు జరిపారు. ఈ భేటీ జరిగిన కొన్ని రోజులకే.. భారత్‌లో టెస్లా నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇక, షోరూం ఏర్పాటు కోసం స్థలం ఎంపికపైనా మస్క్‌ సంస్థ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

స్టార్‌లింక్‌కు భారత్‌ ఇంకా అనుమతులు

ఇకపోతే.. మన దేశంలో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో, సునీల్‌ భారతీ మిత్తల్‌కు చెందిన భారతీ ఎయిర్‌టెల్‌ ఒప్పందం చేసుకున్నాయి. అయితే, స్టార్‌లింక్‌కు భారత్‌ ఇంకా అనుమతులు మంజూరు చేయలేదు. ఈ క్రమంలోనే ఆ సంస్థ ప్రతినిధుల బృందంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల సమావేశమయ్యారు. స్టార్‌లింక్‌కు ప్రస్తుతమున్న భాగస్వామ్యాలు, భారత్‌లో భవిష్యత్‌ పెట్టుబడులు ప్రణాళికపై చర్చలు జరిపారు.

Read Also : భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు

Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Prime Minister Modi Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.