UNESCO recognizes Bhagavad Gita and Dance Science

UNESCO Recognition: భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు

UNESCO Recognition : భారతదేశం విభిన్న సంస్కృతులకు ఆలవాలం. గొప్ప తాత్విక ఆధ్యాత్మిక సంపదకు నిలయం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎన్నో కళలకు ప్రతీతి. భిన్నత్వంలో ఏకత్వంతో ప్రపంచ దేశాలలో సమున్నతంగా సగర్వంగా తలెత్తుకు జీవిస్తున్న భారత్ తాజాగా మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. భారతదేశపు కీర్తి కిరీటంలో యునెస్కో నుంచి తాజాగా వచ్చిన ఒక గుర్తింపు కలికితురాయిగా నిలిచింది. భారతదేశపు గొప్ప సాంస్కృతిక, తాత్విక సంపదకు గుర్తింపుగా, గౌరవ సూచకంగా భగవద్గీత, నాట్యశాస్త్రం యునెస్కో మెమొరీ ది వరల్డ్ రిజిస్టర్లో స్థానం సంపాదించాయి. ఇది భారతీయులందరూ గర్వించదగిన శుభ విషయం.

Advertisements

భగవద్గీతకు యునెస్కోలో చోటు దక్కటం భారతీయులంతా గర్వించదగిన విషయం

శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన, వేద వ్యాసుడు రచించిన భగవద్గీత తో పాటు, భరతముని రచించిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో స్థానం దక్కడం ఒక అరుదైన గుర్తింపు. భగవద్గీత అనేది భారతీయ మతపరమైన ఆలోచన యొక్క గొప్ప సంశ్లేషణ, ధర్మం యొక్క వైదిక భావన. హిందువులు భగవద్గీతను అత్యంత పవిత్రమైన గ్రంథంగా భావిస్తారు. అటువంటి భగవద్గీతకు యునెస్కోలో చోటు దక్కటం భారతీయులంతా గర్వించదగిన విషయం. ఇక ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ గర్వించదగిన క్షణమిది అని భారత ప్రధాని నరేంద్ర మోడీ తన పోస్టులో వెల్లడించారు.

ఇది మన సంస్కృతికి, జ్ఞానానికి లభించిన విశ్వవ్యాప్త గుర్తింపు

భగవద్గీత మరియు నాట్యశాస్త్రం యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకోవడం ఇది విశ్వవ్యాప్తమైన గుర్తింపును మన సంస్కృతికి, భారతీయ జ్ఞానానికి అందించినట్టు అని ఆయన పేర్కొన్నారు. భగవద్గీత మరియు నాట్య శాస్త్రం శతాబ్దాలుగా మన నాగరికతను మరియు చైతన్యాన్ని పెంపొందించాయని ప్రధాని మోడీ అన్నారు. ఈ రెండు గ్రంథాల అంతర్దృష్టులు ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని తన ఎక్స్ ఖాతాలో మోదీ పేర్కొన్నారు.

Read Also: మహారాష్ట్రకు చేరిన హిందీ వివాదం..ప్రభుత్వం ఉత్తర్వులపై విపక్షాల ఆగ్రహం

Related Posts
Pahalgam Terror Attack: పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారం మొదలు కాబోతోందా?
Pahalgam Terror Attack: పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారం మొదలు కాబోతోందా?

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారం మొదలు కాబోతోందా? ఇప్పటికే ఇండియన్‌ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చేశారు ప్రధాని మోదీ. మన వీర జవాన్లు పాక్‌కి ఎలా బుద్ధి చెప్పనున్నారు? Read more

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ పై స్పందించిన భారత క్రికెటర్లు
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ పై స్పందించిన భారత క్రికెటర్లు

ఆపరేషన్ సిందూర్ పేరుతో పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.బుధవారం ( మే 7, 2025 ) అర్ధరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకే ) Read more

పోప్ ఫ్రాన్సిస్‌కు కొనసాగుతున్న చికిత్స
పోప్ ఫ్రాన్సిస్‌కు కొనసాగుతున్న చికిత్స

రోమ్‌లోని గిమేలీ ఆస్పత్రిలో పోప్ ఫ్రాన్సిస్ తన ఆరోగ్య సమస్యలతో 10 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆయన డబుల్ న్యుమోనియాతో (క్లిష్టమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్) బాధపడుతున్నారు. హోలీ Read more

హిందూ దేవాలయానికి పునరుద్ధరణ
temple 1

పాకిస్తాన్ నరోవల్లో ఉన్న 64 సంవత్సరాల పాత హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. చాల సంవత్సరాల క్రితం మూసేయబడిన ఈ దేవాలయం మత సాంస్కృతిక అనువాదాన్ని Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×