ORR Hyderabad : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ప్రయాణించే వాహనదారులకు కీలక సమాచారం. రాబోయే ఏప్రిల్ 1 నుంచి ORRలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా రద్దు చేయనున్నారు. ఇకపై ఫాస్టాగ్ లేదా యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారానే టోల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై అమలు చేస్తున్న క్యాష్లెస్ విధానాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఫాస్టాగ్ లేని వాహనాలు నగదు చెల్లించే వెసులుబాటు ఉంది. అయితే ఏప్రిల్ 1 తర్వాత ఆ అవకాశం ఉండదు. ఫాస్టాగ్ లేనివారు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లతో టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి చెల్లించాలి. ORRపై ఉన్న 19 ఇంటర్ఛేంజ్ టోల్ ప్లాజాలను హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) నిర్వహిస్తోంది.
Read Also: Phone: నోట్లో పేలిన ఫోన్ బ్యాటరీ!

నగదు నిర్వహణలో పారదర్శకత లోపించడం, చిల్లర విషయంలో వివాదాలు, భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. క్యాష్లెస్ విధానం వల్ల ట్రాఫిక్ సాఫీగా సాగడమే కాకుండా టోల్ వసూళ్లలో స్పష్టత పెరుగుతుందని తెలిపారు.
ఇదిలా ఉండగా, ORRపై టోల్ చార్జీలను కూడా పెంచే యోచనలో అధికారులు ఉన్నారు. చివరిసారిగా 2024 ఏప్రిల్లో రేట్లను సవరించగా, 2025లో పెంపు జరగలేదు. దీంతో 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త టోల్ రేట్లు అమల్లోకి వచ్చే అవకాశముందని సమాచారం. దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: