Kishan Reddy : వక్ఫ్ బోర్డుతో ఒవైసీ బ్రదర్స్‌ అనుచరులకే లాభం : కిషన్‌ రెడ్డి

Read Time:  1 min
Only Owaisi Brothers' followers will benefit from the Waqf Board.. Kishan Reddy
Only Owaisi Brothers' followers will benefit from the Waqf Board.. Kishan Reddy
FONT SIZE
GET APP

Kishan Reddy : ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు ఆస్తులను డిజిటలైజేషన్‌ చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్‌ బోర్డు ఆస్తులపై వచ్చిన ఆదాయంలో లాభాన్ని పేద ముస్లింలకు పంచుతామన్నారు. దేశ వ్యాప్తంగా లక్షల ఎకరాల భూమి కబ్జాకు గురైందని, ముస్లిం సమాజం వాస్తవాలు గుర్తించాలని కోరారు.

వక్ఫ్ బోర్డుతో ఒవైసీ బ్రదర్స్‌

వక్ఫ్‌బోర్డును అడ్డం పెట్టుకొని దోపిడీ

జిల్లాల్లో నిర్వహించే సమావేశాలకు అన్ని వర్గాల వారిని ఆహ్వానించాలని పార్టీ నేతలను కోరారు. వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణలోని అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ నేతలకు సూచించారు. వక్ఫ్ బోర్డుతో ఒవైసీ బ్రదర్స్‌ అనుచరులకే లాభం అని కిషన్‌ రెడ్డి అన్నారు. వక్ఫ్‌బోర్డును అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చట్టంలో కలెక్టర్‌కు అధికారాలు ఉంటాయని..
ఇందులో మహిళల భాగస్వామ్యం ఉందని వ్యాఖ్యానించారు. భూములు లాక్కుంటారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్‌లో 70 శాతం వక్ఫ్ భూములు కబ్జా

వక్ఫ్ భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇకపై నాయకుల ఇళ్లలో కాదు, కంప్యూటర్‌లో ఉంటాయని తెలిపారు. వక్ఫ్‌ బోర్డుతో ఎంత మందికి లాభం చేశారో రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఒవైసీ చర్చకు సిద్ధమా అని కిషన్‌ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో 70 శాతం వక్ఫ్ భూములను కాంగ్రెస్, ఒక మతానికి చెందిన నేతలు కబ్జా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. మసీదులు వేరు, వక్ఫ్ బోర్డు భూములు వేరు అని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: కుటుంబం దేశాన్ని లూటీ చేయడమే లక్ష్యం కిషన్ రెడ్డి

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.