విశాఖ కోర్టుకు నారా లోకేష్

Read Time:  1 min
lokesh sakshi
lokesh sakshi
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖపట్నంలోని 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరుకానున్నారు. సాక్షి పత్రికపై పరువు నష్టం దావా కేసు విచారణ సందర్భంగా ఆయన స్వయంగా కోర్టులో హాజరవుతున్నారు. 2019 సంవత్సరానికి ముందు వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో స్నాక్స్ కోసం భారీ ఖర్చు చేశారని సాక్షి ప్రచురించిన కథనం దీనికి కారణమైంది.ఈ కథనాన్ని తప్పుడు సమాచారమని నారా లోకేశ్ అప్పట్లోనే ఖండించారు. అది పూర్తిగా నిరాధారమని, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందని ఆరోపించారు. అందుకే, సాక్షి పత్రికపై రూ. 75 కోట్ల పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఈ కేసు విచారణలో కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో, నేడు నారా లోకేశ్ కోర్టులో స్వయంగా హాజరుకానున్నారు. కోర్టు ముందు న్యాయపరమైన అంశాలు చర్చించబడే అవకాశం ఉంది.

లోకేశ్ తరఫు న్యాయవాదులు సాక్షి పత్రిక చేసిన ప్రచారాన్ని నిరాధారంగా నిరూపించే దిశగా తమ వాదనలు వినిపించనున్నారు. సాక్షి పత్రిక నుంచి వివరణ రావాల్సిన పరిస్థితి కూడా ఉండవచ్చు. ఈ విచారణపై ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ విశాఖ కోర్టు ముందు ఇవాళ హాజరు కానున్నారు. పరువు నష్టం దావా కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు వెళ్లనున్నారు. ఓ పత్రిక ‘‘చినబాబు చిరుతిండి. 25 లక్షలండి’’ అంటూ 2019లో నారా లోకేశ్ పై కథనం ప్రచురించింది. ఈ కథనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్.. సదరు పత్రికపై రూ.75కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో జరగనుంది. ఈ సందర్భంగా క్రాస్ ఎగ్జిమినేషన్ కోసం లోకేశ్ కోర్టుకు హాజరు కానున్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.