📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Ap HighCourt :పిల్ ఉపసంహరణ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: April 24, 2025 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ హైకోర్టు పిల్స్, పిటిషన్ల అంశంపై సీరియస్ కామెంట్స్ చేసింది. పిల్‌ వేసి ఉపసంహరించుకుంటామంటే ఒప్పుకోబోమని చెప్పింది. శ్రీకాకుళం జిల్లా, గార మండలం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో అణుధార్మిక బీచ్‌శాండ్‌ తవ్వకాల టెండర్‌ను సవాల్ చేస్తూ పిల్ దాఖలైంది. అయితే ఈ పిల్‌ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ చేసిన అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. అలాగే, గుంటూరు జిల్లా, తాడేపల్లిలో కృష్ణానది ఒడ్డున నిర్మించిన కట్టడాల కూల్చివేతకు సంబంధించిన పిల్‌ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్ చేసిన ప్రయత్నాన్ని కూడా కోర్టు వ్యతిరేకించింది. ఈ రెండు కేసుల్లోనూ పిటిషనర్లు రూ.లక్ష చొప్పున కోర్టులో జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది.ఒకసారి పిల్‌ వేసిన తర్వాత ఉపసంహరించుకుంటామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. ముందుగా రూ.లక్ష రూపాయలు కోర్టులో కట్టాలని పిటిషనర్‌కు సూచించింది. ఆ తర్వాత పిల్ ఉపసంహరణ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో గ్రీన్‌ జోన్‌లో కట్టడాల కూల్చివేతకు సంబంధించిన పిల్‌ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ చేసిన ప్రయత్నాన్ని కూడా కోర్టు అడ్డుకుంది. దీనికి కూడా రూ.లక్ష జరిమానా విధించింది. పిల్‌ వేసి ఉపసంహరించుకుంటామని అంటే ఒప్పుకునేది లేదని వ్యాఖ్యానించింది.

నోటీసులు జారీ

డీ అడిక్షన్ సెంటర్లపై ప్రజల్లో సరైన అవగాహన లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేంద్రాలపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. మద్యం విముక్తి కేంద్రాలపై అవగాహన కల్పించడానికి తీసుకుంటున్న చర్యలు, కేటాయించిన బడ్జెట్‌ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరోగ్య, ఎక్సైజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఒక వ్యక్తికి నెలలో అమ్మే మద్యం సీసాల సంఖ్యను పరిమితం చేయాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను మాత్రం కోర్టు తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రజా ప్రయోజనం

డీ అడిక్షన్ సెంటర్ల పనితీరును పర్యవేక్షించాలని, బాధితులకు అందుతున్న చికిత్సను పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన షిరిన్‌ రెహ్మాన్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఆధార్‌ కార్డుతో లింక్ చేసి 21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మకుండా ఆపాలని కోరారు.హైకోర్టు, పిల్ యొక్క ఉద్దేశం ప్రజా ప్రయోజనంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఒక పిల్ దాఖలు చేసినప్పుడు, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తెలియజేయాలని, అంతేకాకుండా అది ప్రజా ప్రయోజనానికి అనుకూలంగా ఉందో లేదో పరిశీలించాలని హైకోర్టు అభిప్రాయపడింది.

Read Also: Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్ట్‌

#AndhraPradeshHighCourt #BeachSandMining #EnvironmentalLitigation #JudicialRemarks #PIL Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.