हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

రూ.800, రూ.900 నాణేలు చూసారా?

Sharanya
రూ.800, రూ.900 నాణేలు చూసారా?

మనకు రోజూ కనిపించే రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలతోపాటు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మింట్ లిమిటెడ్ ఎడిషన్ నాణేలను విడుదల చేస్తుంది. కానీ, సాధారణంగా కరెన్సీ లావాదేవీల్లో రూ. 800, రూ. 900 వంటి నాణేలు ఉండవు. అయితే, ప్రత్యేకమైన సందర్భాల్లో, కొందరు మహానుభావుల జయంతి లేదా చారిత్రక సంఘటనల సందర్భంలో ఆర్బీఐ లేదా మింట్ అరుదైన నాణేలను విడుదల చేస్తుంది.

2900 rev obv

రూ. 800, రూ. 900 నాణేల ప్రత్యేకత

తాజాగా, జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి జయంతిని పురస్కరించుకుని ముంబయి మింట్ వెండితో తయారు చేసిన రూ. 800, రూ. 900 నాణేలను విడుదల చేసింది. ఈ నాణేలు రూ. 40 గ్రాముల వెండితో తయారవగా, చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే విడుదలయ్యాయి. ఈ నాణేలను కలెక్షన్ చేసుకునే అభిమానం ఉన్నవారికి మాత్రమే దక్కేలా రూపొందించారు. ఈ నాణేలు సాధారణ వినియోగం కోసం కాకుండా, న్యూమిస్మాటిస్టులు (కరెన్సీ సేకరించే వ్యక్తులు) లేదా అరుదైన వస్తువులు కలెక్షన్ చేసేవారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) లేదా ప్రభుత్వ మింట్ వాటిని ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతుంది. మదనపల్లెకు చెందిన మహ్మద్ వాయిస్ ఇటువంటి అరుదైన నాణేలను సేకరించే అభిమానం కలిగిన వ్యక్తిగా పేరు గాంచారు. ఆయన వద్ద ఇప్పటికే 170 దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీలు ఉన్నాయట.

ఇతర అరుదైన నాణేలు

ఇలాంటి ప్రత్యేక నాణేలు గతంలో కూడా విడుదలయ్యాయి. ఉదాహరణకు, మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ₹150 నాణెం , భారతీయ పార్లమెంట్ 100 సంవత్సరాల వేడుకల సందర్భంగా ₹100 నాణెం , సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ₹125 నాణెం , బాల్ గంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ₹175 నాణెం. ఇటీవల విడుదలైన నాణేలను భారత ప్రభుత్వ మింట్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఆర్బీఐ వెబ్‌సైట్ లో ఆర్డర్ చేయవచ్చు. అయితే, లిమిటెడ్ ఎడిషన్ కావడంతో ఇవి త్వరగా అమ్ముడైపోతాయి. ఈ హాబీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కలిగివుంటారు. న్యూమిస్మాటిక్స్ అంటే కరెన్సీ, నాణేలు, స్టాంపులు మొదలైన వాటిని సేకరించే శాస్త్రం. ప్రపంచంలోని వివిధ దేశాల నాణేలు, కరెన్సీలు సేకరించేవారు వేలాది మంది ఉన్నారు. మహ్మద్ వాయిస్ కూడా ఇలాంటి అభిరుచి కలిగిన వ్యక్తి. ₹800, ₹900 నాణేలు సాధారణ వినియోగం కోసం కాకుండా, అరుదైన నాణేలు సేకరించేవారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ నాణేలను ప్రభుత్వ మింట్ లేదా ఆర్బీఐ వెబ్‌సైట్‌లో మాత్రమే పొందవచ్చు. మీకు కూడా న్యూమిస్మాటిక్స్ అంటే ఆసక్తి ఉంటే, అలాంటి అరుదైన నాణేలను సేకరించే ప్రయత్నం చేయవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870