📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: East Godavari: వసతిగృహాలలో పిల్లల భద్రతపై జిల్లా కలెక్టర్ హెచ్చరిక

Author Icon By Saritha
Updated: October 23, 2025 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తూర్పుగోదావరి జిల్లా : జిల్లాలోని(East Godavari) ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో పిల్లల సంరక్షణ, భద్రత విషయంలో పూర్తి అప్రమత్తత పాటించాలంటూ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల నగరంలోని ఒక వసతి గృహంలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై కెఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(Deputy Collector) నేతృత్వంలో సమగ్ర విచారణ చేపట్టగా, విచారణలో హాస్టల్ సంక్షేమ అధికారి ఉమా దేవి విధుల్లో నిరక్ష ప్రదర్శించినట్లు నిర్ధారణ కావడంతో, ఆమెను తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ వసతి గృహాల పిల్లల భద్రత, రక్షణ అంశాల్లో ఎవరైనా నిరక్ష్యంగా వ్యవహరించినా, కఠినచర్యలు తప్పవు అని హెచ్చరించారు.

Read also: టీచర్లకు ‘టెట్’ రెండు రోజుల్లో నోటిఫికేషన్

East Godavari: వసతిగృహాలలో పిల్లల భద్రతపై జిల్లా కలెక్టర్ హెచ్చరిక

ప్రతి వార్డెన్ భద్రతా బాధ్యతను నెరవేర్చాలని కలెక్టర్ హెచ్చరిక

ప్రతి వసతి గృహ వార్డెన్ తమ పరిధిలోని పిల్లల(East Godavari) సంరక్షణలో సంపూర్ణ బాధ్యత వహించాలని, అప్రమత్తతతో వ్యవహరించాలని, భద్రత పరమైన చర్యలు పాటించాలి,” అని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వసతి గృహాల నుండి పిల్లలను పంపించే ముందు, వారి బంధువుల వివరాలు, గుర్తింపు ఆధారాలు పూర్తిగా నమోదు చేయడం తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు. భద్రతా చర్యలు పాటించడంలో ఏ చిన్న లోపమూ చోటు చేసుకోరాదని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని సంబంధిత అధికారులు, సిబ్బంది ఈ సూచనలను కచ్చితంగా అమలు చేయాలని, వసతి గృహాల్లో పిల్లల భద్రతకు సంబంధించి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Ap News in Telugu child safety District Collector East Godavari Government Hostels Hostel Security Keerthi Chekuri welfare hostels

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.