ఏపీ ప్రభుత్వం (AP Government) ఉపాధ్యాయ నియామక ప్రక్రియ కోసం AP DSC 2025 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను విజయవంతంగా ముగించింది.ఈ నేపథ్యం లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ 2025 హాల్ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in/ ద్వారా తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు.జూన్ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీకి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంతోపాటు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడుల్లోనూ ఎగ్జామ్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు.
నిరుద్యోగులకు
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన పోస్టులకు 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 5.67 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు. అంటే ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు అర్థమవుతోంది.ఇందులో ప్రధానంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT), స్కూల్ అసిస్టెంట్స్ (SA), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), ప్రిన్సిపల్స్ వంటి పోస్టులు ఉన్నాయి. అయితే డీఎస్సీ (Mega DSC) టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం అని అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి పోస్టుల సంఖ్య భారీగా ఉండటంతో పోటీ కూడా అంతేస్థాయిలో ఉండనుంది.
సమాచారం
ఈ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్లైన్ మోడ్ (Online Exams)లో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ అందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. పరీక్ష కేంద్రాల ఎంపిక దాదాపు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రోజుకు 40 వేల మంది పరీక్షలు రాసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే ప్రతి సెషన్కు 20వేల సీటింగ్ సామర్థ్యంతో రోజుకు రెండు సెషన్లలో 40వేల మంది అభ్యర్థులు ప్రతిరోజూ పరీక్ష రాసే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
Read Also: Mineral Exploration: ఏపీలో ఖనిజాన్వేషణకు ప్రభుత్వం ఆహ్వానం