ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత వేగంగా విస్తరిస్తోంది. ఈ సాంకేతికతను అనుసరిస్తున్న సంస్థలు తమ కార్యకలాపాలను ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నాయి. దీనివల్ల మానవ వనరులపై ఆధారపడే అవసరం తగ్గిపోతోంది. తాజాగా అమెజాన్, ఐబీఎం వంటి టెక్ దిగ్గజాలు సిబ్బంది సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించాయి. మొన్న అమెజాన్ 14 వేల మంది ఉద్యోగులను తొలగించగా, ఇప్పుడు ఐబీఎం కూడా ఈ ఏడాది చివరి నాటికి వేల మందిని లేఆఫ్ చేయనున్నట్లు ప్రకటించింది.
Latest News: Guntur: ఉప్పుతో రూపొందించిన అద్భుత శివపార్వతి రూపం!
ఐబీఎం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.7 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. “సింగిల్ డిజిట్ 1%” ఉద్యోగులను తగ్గించే యోచనలో ఉందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. అంటే కనీసం 2,700 మందికి ఉద్యోగ భయం తప్పదన్న మాట. ఈ నిర్ణయం కృత్రిమ మేధస్సు ప్రాజెక్టులు, ఆటోమేటెడ్ సిస్టమ్లు, మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పై సంస్థ దృష్టి పెరగడం వల్లనే తీసుకున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీలు మానవ శ్రమను తగ్గిస్తూ, సాంకేతిక పరిజ్ఞానంతో పనిని వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.
ఈ పరిణామం భారతదేశం వంటి దేశాలకు కూడా ప్రభావం చూపిస్తోంది. ఐబీఎం, అమెజాన్ వంటి సంస్థలు భారత్లో పెద్ద స్థాయి కార్యాలయాలు నిర్వహిస్తున్నాయి. వేలాది మంది ఐటీ నిపుణులు వీటిలో పనిచేస్తున్నారు. AI వల్ల కొత్త అవకాశాలు సృష్టిస్తున్నా, సంప్రదాయ ఉద్యోగాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిపుణులు భావిస్తున్నారు – AI యుగంలో ముందుకు సాగాలంటే ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం తప్పనిసరి అవుతుందని. కృత్రిమ మేధస్సు అభివృద్ధి తీరుతోపాటు, మానవ శక్తిని సమతుల్యం చేయడం ఇప్పుడు ప్రపంచ ఐటీ రంగానికి పెద్ద సవాలుగా మారింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/