📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Breaking News – Lay Off : లేఆఫ్ బాటలో మరో సంస్థ

Author Icon By Sudheer
Updated: November 5, 2025 • 8:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత వేగంగా విస్తరిస్తోంది. ఈ సాంకేతికతను అనుసరిస్తున్న సంస్థలు తమ కార్యకలాపాలను ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నాయి. దీనివల్ల మానవ వనరులపై ఆధారపడే అవసరం తగ్గిపోతోంది. తాజాగా అమెజాన్, ఐబీఎం వంటి టెక్ దిగ్గజాలు సిబ్బంది సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించాయి. మొన్న అమెజాన్ 14 వేల మంది ఉద్యోగులను తొలగించగా, ఇప్పుడు ఐబీఎం కూడా ఈ ఏడాది చివరి నాటికి వేల మందిని లేఆఫ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Latest News: Guntur: ఉప్పుతో రూపొందించిన అద్భుత శివపార్వతి రూపం!

ఐబీఎం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.7 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. “సింగిల్ డిజిట్ 1%” ఉద్యోగులను తగ్గించే యోచనలో ఉందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. అంటే కనీసం 2,700 మందికి ఉద్యోగ భయం తప్పదన్న మాట. ఈ నిర్ణయం కృత్రిమ మేధస్సు ప్రాజెక్టులు, ఆటోమేటెడ్ సిస్టమ్‌లు, మరియు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పై సంస్థ దృష్టి పెరగడం వల్లనే తీసుకున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీలు మానవ శ్రమను తగ్గిస్తూ, సాంకేతిక పరిజ్ఞానంతో పనిని వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

amazon

ఈ పరిణామం భారతదేశం వంటి దేశాలకు కూడా ప్రభావం చూపిస్తోంది. ఐబీఎం, అమెజాన్ వంటి సంస్థలు భారత్లో పెద్ద స్థాయి కార్యాలయాలు నిర్వహిస్తున్నాయి. వేలాది మంది ఐటీ నిపుణులు వీటిలో పనిచేస్తున్నారు. AI వల్ల కొత్త అవకాశాలు సృష్టిస్తున్నా, సంప్రదాయ ఉద్యోగాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిపుణులు భావిస్తున్నారు – AI యుగంలో ముందుకు సాగాలంటే ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం తప్పనిసరి అవుతుందని. కృత్రిమ మేధస్సు అభివృద్ధి తీరుతోపాటు, మానవ శక్తిని సమతుల్యం చేయడం ఇప్పుడు ప్రపంచ ఐటీ రంగానికి పెద్ద సవాలుగా మారింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

amazon Latest News in Telugu Lay Off

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.