పంజాబ్(Punjab) లోని అమృత్సర్లో బాంబు పేలుడు కలకలం రేపింది. మే 27 మంగళవారం రోజున అమృత్సర్లోని మజితా రోడ్ బైపాస్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో ఒక వ్యక్తి మరణించినట్టుగా తెలిసింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పేలుడు పదార్థం తయారీపై ఫోరెన్సిక్ అధికారులు పరిశీలిస్తున్నారని పోలీసులు తెలిపారు. గ్యాంగ్స్టర్లు లేదా ఉగ్రవాదుల ప్రమేయం లేకపోవచ్చని ప్రాథమికంగా గుర్తించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గోల్డెన్ టెంపుల్కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. సంఘటన స్థలంలో పేలుడు కారణంగా అక్కడికక్కడే మరణించారు. మంగళవారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో మజితా రోడ్ బైపాస్లోని డీసెంట్ అవెన్యూ కాలనీ సమీపంలో పేలుడు సంభవించింది. పెద్ద శబ్ధంతో ఆకస్మిక పేలుడుతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో ఘటనా స్థలంలో పరిశీలిస్తున్నారు. పోలీసులు పరిస్థితి అదుపులో ఉందని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. డిసెంబర్ 2024: అమృత్సర్లోని పోలీస్స్టేషన్ సమీపంలో పేలుడు సంభవించింది.

పంజాబ్లో గతంలో జరిగిన ఇతర పేలుళ్లు
డిసెంబర్ 2021: లూధియానాలో కోర్టు కాంప్లెక్స్లో బాంబు పేలుడు జరిగింది. మే 2023: గోల్డెన్ టెంపుల్ సమీపంలో హెరిటేజ్ స్ట్రీట్లో పేలుడు సంభవించింది. ప్రాంతంలో భద్రతా చర్యలు: పోలీసులు భద్రతా చర్యలను పెంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
Read Also: Asaduddin Owaisi: కాపీ కొట్టడం రాని దద్దమ్మలు.. పాక్ పై అసదుద్దీన్ చురకలు..