ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యం : ఆదిత్య ఠాక్రే

ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యం : ఆదిత్య ఠాక్రే

దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేసి అంతం చేయడమే బీజేపీ కల అని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే విమర్శించారు. తమ పార్టీకి, కేజ్రీవాల్‌కు, కాంగ్రెస్‌కు ఏమి జరిగిందో భవిష్యత్తులో నితీశ్‌, ఆర్జేడీ, చంద్రబాబుకు అదే జరుగవచ్చని అన్నారు. దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేసి అంతం చేయడమే బీజేపీ కల అని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే విమర్శించారు. తమ పార్టీకి, కేజ్రీవాల్‌కు, కాంగ్రెస్‌కు ఏమి జరిగిందో భవిష్యత్తులో నితీశ్‌, ఆర్జేడీ, చంద్రబాబుకు అదే జరుగవచ్చని అన్నారు. ఢిల్లీలో పర్యటించిన ఆదిత్య ఠాక్రే, ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి రాహుల్ గాంధీని కలిసినట్లు తెలిపారు. గురువారం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అవుతున్నట్లు చెప్పారు.
ఓటర్ల, ఈవీఎం మోసాలు
కాగా, దేశ భవిష్యత్తు సందేహంలో ఉందని ఆదిత్య ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇవాళ దేశంలో ఓటర్ల మోసం, ఈవీఎం మోసాల మధ్య మన ఓటు ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. నేడు మన దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరుగుతున్నాయా? మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని భావిస్తున్నాం, కానీ అది ఇకపై ప్రజాస్వామ్యం కాదు.

Advertisements

మాకు (శివసేన), కేజ్రీవాల్, కాంగ్రెస్‌కు ఏమి జరిగిందో, భవిష్యత్తులో నితీశ్‌, ఆర్జేడీ, చంద్రబాబుకు జరుగవచ్చు. దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేసి అంతం చేయడమే బీజేపీ కల’ అని అన్నారు.

ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యం : ఆదిత్య ఠాక్రే


రోడ్ మ్యాప్‌ సిద్ధం
ఇండియా బ్లాక్ భవిష్యత్తుపై ఆదిత్య ఠాక్రే మాట్లాడారు. ఇండియా బ్లాక్‌లో చాలా మంది సీనియర్‌ నాయకులు ఉన్నారని తెలిపారు. దాని కోసం వారు రోడ్ మ్యాప్‌ సిద్ధం చేస్తారని చెప్పారు. ‘ఇండియా బ్లాక్‌కు ఉమ్మడి నాయకత్వం ఉంది.

Related Posts
మహా కుంభమేళా 2025: పురాతన శాస్త్రం
మహా కుంభమేళా 2025 పురాతన శాస్త్రం

జనవరి 13న ప్రారంభం కానున్న మహాకుంభ మేళా ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటి మాత్రమే కాదు, ఆధ్యాత్మికత, పురాణాలు మరియు విజ్ఞాన శాస్త్రం యొక్క మనోహరమైన Read more

మళ్లీ ఇస్రో ‘స్పేడెక్స్‌’వాయిదా..
ISRO Postpones Space Docking Experiment Again

బెంగళూరు : ఇస్రో చేపట్టిన స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌(స్పేడెక్స్‌)కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. గురువారం అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం(డాకింగ్‌) చేయాలని ఇస్రో భావించింది. ఇందుకోసం రెండు ఉపగ్రహాలను Read more

నవంబర్ 19 వరకు ఎయిరిండియాలో ప్రయాణించొద్దు.. ఖలిస్థానీ టెర్రరిస్టు పన్నున్ హెచ్చరిక
Dont fly Air India from November 1 19. Khalistani terrorist Pannuns new threat

న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ మరో హెచ్చరిక జారీ చేశాడు. నవంబర్ 1 నుంచి 19 మధ్య Read more

Tollgate : రహదారులపై సరికొత్త టెక్నాలజీతో టోల్ ఛార్జీలు!
రహదారులపై సరికొత్త టెక్నాలజీతో టోల్ ఛార్జీలు!

దేశంలో జాతీయ రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణం మరింత సులభంగా, వేగంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాలను తీసుకువస్తోంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద గంటల Read more

×