దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేసి అంతం చేయడమే బీజేపీ కల అని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే విమర్శించారు. తమ పార్టీకి, కేజ్రీవాల్కు, కాంగ్రెస్కు ఏమి జరిగిందో భవిష్యత్తులో నితీశ్, ఆర్జేడీ, చంద్రబాబుకు అదే జరుగవచ్చని అన్నారు. దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేసి అంతం చేయడమే బీజేపీ కల అని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే విమర్శించారు. తమ పార్టీకి, కేజ్రీవాల్కు, కాంగ్రెస్కు ఏమి జరిగిందో భవిష్యత్తులో నితీశ్, ఆర్జేడీ, చంద్రబాబుకు అదే జరుగవచ్చని అన్నారు. ఢిల్లీలో పర్యటించిన ఆదిత్య ఠాక్రే, ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి రాహుల్ గాంధీని కలిసినట్లు తెలిపారు. గురువారం అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అవుతున్నట్లు చెప్పారు.
ఓటర్ల, ఈవీఎం మోసాలు
కాగా, దేశ భవిష్యత్తు సందేహంలో ఉందని ఆదిత్య ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇవాళ దేశంలో ఓటర్ల మోసం, ఈవీఎం మోసాల మధ్య మన ఓటు ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. నేడు మన దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరుగుతున్నాయా? మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని భావిస్తున్నాం, కానీ అది ఇకపై ప్రజాస్వామ్యం కాదు.
మాకు (శివసేన), కేజ్రీవాల్, కాంగ్రెస్కు ఏమి జరిగిందో, భవిష్యత్తులో నితీశ్, ఆర్జేడీ, చంద్రబాబుకు జరుగవచ్చు. దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేసి అంతం చేయడమే బీజేపీ కల’ అని అన్నారు.

రోడ్ మ్యాప్ సిద్ధం
ఇండియా బ్లాక్ భవిష్యత్తుపై ఆదిత్య ఠాక్రే మాట్లాడారు. ఇండియా బ్లాక్లో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారని తెలిపారు. దాని కోసం వారు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తారని చెప్పారు. ‘ఇండియా బ్లాక్కు ఉమ్మడి నాయకత్వం ఉంది.