Bandh:కర్ణాటక లో కొనసాగుతున్నబంద్

Bandh:కర్ణాటక లో కొనసాగుతున్నబంద్

కర్ణాటకలో కన్నడ భాషోద్యమ నాయకుడు వాటల్ నాగరాజ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చారు. కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కారణంగా ఈ నిరసన టెన్షన్ గా మారింది.

Advertisements

సరిహద్దు వివాదం

కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కారణంగా ఈ నిరసన ఉధృతంగా మారింది.కర్ణాటక- మహారాష్ట్ర మధ్య సుదీర్ఘకాలంగా సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కర్ణాటక బెళగావి జిల్లాలోని 800లకకు పైగా గ్రామాలు తమవేనంటూ వాదిస్తూ వస్తోంది మహారాష్ట్ర. గతంలోనూ ఈ రెండు రాష్ట్రాల్లో పలుమార్లు ఉద్యమాలు చోటు చేసుకున్నాయి.ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో- కొద్దిరోజుల కిందటే కర్ణాటక ఆర్టీసీ బస్ కండక్టర్‌పై మహారాష్ట్రానికి చెందిన ఒకరు దాడి చేశారు. టికెట్ కొనే విషయంలో ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలీవానగా మారింది. దాడి వరకూ వెళ్లింది. ఈ ఘటనలో కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

కర్ణాటక వ్యాప్తంగా బంద్ ప్రభావం

కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.ఈరోజు తెల్లవారు జామున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగుతుంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులేవీ రోడ్డెక్కట్లేదు. ఓలా, ఉబేర్ వంటి సంస్థలు సైతం బంద్‌లో భాగస్వామ్యం అయ్యాయి. బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం వరకూ సినిమాల ప్రదర్శనను కూడా నిలిపివేశారు. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు బంద్ అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలేవీ పని చేయట్లేదు.

MixCollage 21 Mar 2025 02 04 PM 7540 2025 03 0412e2fa2618a9f29bd94caf4a2f3515 16x9

కెంపేగౌడ బస్ స్టేషన్‌

బెంగళూరు సహా దాదాపు అన్ని జిల్లాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. మెజస్టిక్ కెంపేగౌడ బస్ స్టేషన్‌లో ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గింది.కర్ణాటక ఆర్టీసీ (కెఎస్ఆర్ టిసి) మరియు ప్రైవేట్ బస్సులు రోడ్లపైకి రాలేదు.ఓలా, ఉబర్ క్యాబ్‌లు కూడా బంద్‌లో భాగస్వామ్యం అయ్యాయి.ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సినిమా థియేటర్లు మధ్యాహ్నం వరకూ మూసివేయబడ్డాయి.హోటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.బెంగళూరు మెజస్టిక్, మైసూరు శాటిలైట్ బస్ స్టేషన్లు పూర్తిగా ఖాళీగా కనిపించాయి.

బంద్ ప్రభావం

మైసూరు, రామనగర,మద్దూరు, మండ్య, చామరాజనగర ప్రాంతాలకు వెళ్లే బస్సులు లేవు.మంగళూరు, ఉడుపి జిల్లాల్లో బంద్ ప్రభావం అధికంగా ఉంది.ఆంధ్రప్రదేశ్ సరిహద్దు,హిందూపురం, అనంతపురం, మదనపల్లి, తిరుపతి వెళ్లే బస్సులు తగ్గిపోయాయి.

Related Posts
వక్స్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
Union Cabinet2

JPC (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) రిపోర్టు ఆధారంగా సవరించిన వక్స్ బిల్లును కేంద్ర క్యాబినెట్ తాజాగా ఆమోదించింది. మార్చి 10నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో Read more

Mallikarjun Kharge : సర్దార్ పటేల్ పేరు వెనుక రాజకీయం చేస్తే సరిపోదు: ఖర్గే ఫైర్
Mallikarjun Kharge సర్దార్ పటేల్ పేరు వెనుక రాజకీయం చేస్తే సరిపోదు ఖర్గే ఫైర్

స్వాతంత్ర్యం కోసం పోరాడని వారు ఇప్పుడు themselves as సర్దార్ పటేల్ వారసులు అంటూ ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు Read more

Delhi: చల్లనైన మనసు గల ప్రిన్సిపల్ ఏం చేసిందంటే?
Delhi: చల్లనైన మనసు గల ప్రిన్సిపల్ ఏం చేసిందంటే?

వేసవి వేడి భరించలేని స్థాయికి చేరిన ఈరోజుల్లో, ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఓ కాలేజీ ప్రిన్సిపల్ చేసిన పని నెట్టింటా హాట్ టాపిక్ అయింది. ఈ ఘటన Read more

America :26/11 దాడి నిందితుడు తహవ్వూర్ రాణా – అమెరికా సుప్రీంకోర్టు విచారణ
26/11 దాడి నిందితుడు తహవ్వూర్ రాణా – అమెరికా సుప్రీంకోర్టు విచారణ

ముంబై 26/11 ఉగ్రవాద దాడి నిందితుడు తహవూర్ రాణాను భారతదేశానికి అప్పగించడాన్ని నిలిపివేయాలని కోరుతూ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్‌కు సమర్పించిన కొత్త దరఖాస్తును అమెరికా సుప్రీంకోర్టు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×