Assembly sessions to resume

తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌: ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. సోమవారం ఉదయం సమావేశాలు పునఃప్రారంభమైన తర్వాత తొలుత సభ్యుల మౌఖిక ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. అనంతరం బీఏసీ (బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ) సమావేశం కానున్నది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలి? వంటి అంశాలపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సభ సమావేశాలను వారంపాటు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం.

ఈ రోజు ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. ఆ తర్వాత, తెలంగాణ యువ భారత వ్యాయామ విద్య, క్రీడా విశ్వవిద్యాలయం బిల్లు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను చేపడతారు. శాసనమండలిలో కూడా ఇదే అంశంపై చర్చ జరగనుంది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ వ్యవహారాలు సహా పలు శాఖల బిల్లులు సభకు వచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది.

కాగా, గత సోమవారం సమావేశాల ప్రారంభం రోజే తెలంగాణతల్లి నూతన విగ్రహం, రూపురేఖలు వంటి అంశాలపై సభలో చర్చించారు. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ సభ్యులను ఉభయసభల్లోకి ఉద్దేశపూర్వకంగానే రాకుండా చేసి, ప్రభుత్వం చర్చ పెట్టిందనే విమర్శలు వినిపించాయి. తెలంగాణ ప్రజలు ఆరాధించిన తల్లిని కాదని, అభయహస్తం తల్లిని ఉద్దేశపూర్వకంగా రుద్దాలనే కుట్రను ప్రభుత్వం చేసిందని, ఆ బండారం అంతా తాము బయటపెడతామనే భయంతోనే తమను ముందస్తుగానే సభకు రాకుండా అరెస్టు చేయించిందని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నది.

Related Posts
డ్రగ్ వార్ కేసులో ఫిలిప్పీన్స్ మాజీ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ అరెస్టు
డ్రగ్ వార్ కేసులో ఫిలిప్పీన్స్ మాజీ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ అరెస్టు

డ్ర‌గ్గీల‌ను కాల్చి చంపిన కేసులో.. ఫిలిప్పీన్స్ మాజీ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టీని అరెస్టు చేశారు. అంత‌ర్జాతీయ క్రిమిన‌ల్ కోర్టు ఆదేశాల ప్ర‌కారం ఆయ‌న్ను మ‌నీలా ఎయిర్‌పోర్టులో అదుపులోకి Read more

నేడు రైతుల ఖాతాలో పీఎం కిసాన్‌ డబ్బులు జమ..!
Today, PM Kisan money is deposited in farmers account.

19వ విడత డబ్బులను విడుదల న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తోంది. దీని ద్వారా రైతులకు ప్రతీ Read more

ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..
Special meeting of Telangana Assembly today

హైదరాబాద్‌: ఒక రోజు ముందుగానే అంటే రేపు (మంగళవారం) తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. Read more

పాలమూరులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడవనున్నఆర్టీసీ బస్సులు
పాలమూరులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడవనున్నఆర్టీసీ బస్సులు

తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చిన హామీ ప్రకారం, ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల నిర్వహణ హక్కులు కల్పించిన చర్య ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా సాధికారతకు కొత్త మార్గాలను Read more