రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం (24) నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. సభ వాయిదా అనంతరం (బీఏసీ)సమావేశంలో సమావేశాల వ్యవధి, ఎజెండా ఖరారు చేయనున్నారు. మొత్తం రెండు లేదా మూడు వారాల పాటు ఈ సమావేశాలు కొనసాగే అవకాశముంది.ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ విధానాలు, కొత్త పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా రైతు సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ఉపాధి తదితర అంశాలపై చర్చ జరగనుంది.

Advertisements

వైకాపా ఎమ్మెల్యేల హాజరు

ఈ సమావేశాలకు వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం మొదటిసారి జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రతిపక్షంగా మారిన వైకాపా, అధికార టీడీపీ మధ్య వాగ్వాదాలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు.

భద్రతా ఏర్పాట్లు

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రవేశాలపై నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా ప్రతినిధులు, సందర్శకులు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాసులు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా పాసులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు.

AP First Assembly Session Schedule 1560239730 162

విభిన్న రంగుల కోడ్‌లతో పాసులను జారీ చేస్తూ అసెంబ్లీ బులెటిన్ విడుదలైంది.

గేట్ 1 – మండలి ఛైర్మన్, స్పీకర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం

గేట్ 2 – మంత్రులకు

గేట్ 4 – ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతి.మండలి ఛైర్మన్, స్పీకర్, ముఖ్యమంత్రి కారిడార్‌లోకి ఇతరులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మంత్రులు, సభ్యుల వ్యక్తిగత సహాయకులను అవసరమైతే మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.

భద్రతా కారణాల దృష్ట్యా

భద్రతా కారణాల దృష్ట్యా అసెంబ్లీ ఆవరణలో ఆయుధాలు, లాఠీలు, ప్లకార్డులు, విజిల్స్ వంటి వాటిని తీసుకురావడం నిషేధించారు. అలాగే సభ్యులు తమ వ్యక్తిగత సహాయకులను తీసుకురావొద్దని సూచించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ మినహా ఇతర చోట్ల మీడియా సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో ప్రదర్శనలు, ధర్నాలు, బైఠాయింపులు పూర్తిగా నిషేధించబడ్డాయి.

ఈ సమావేశాల్లో అధికార టీడీపీ ప్రభుత్వం కీలకమైన బడ్జెట్ అసెంబ్లీ లో ప్రవేశపెట్టనుంది. అయితే ప్రతిపక్ష వైకాపా పలు అంశాలపై ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విద్య, వైద్య, ఉపాధి, రైతు సంక్షేమం వంటి విషయాల్లో ప్రభుత్వ వైఖరిపై చర్చ జరగనుంది.మొత్తంగా, ఏపీ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి. రాజకీయ విభేదాల మధ్య బడ్జెట్‌పై ఏ మేరకు చర్చ జరుగుతుందో చూడాలి.

Related Posts
తెలుగు రాష్ట్రాలకు రికార్డు స్థాయిలో రైల్వే బడ్జెట్
తెలుగు రాష్ట్రాలకు రికార్డు స్థాయిలో రైల్వే బడ్జెట్

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలకు భారీ స్థాయిలో రైల్వే బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. Read more

వైపీసీవల్లే గ్యారంటీలు ఆలస్యం: లోకేష్
nara lokesh

గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే 6 గ్యారంటీలు ఆలస్యం అవుతున్నాయని ఐటీ, విద్యామంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ బకాయిలను తాము చెల్లిస్తున్నామన్నారు. Read more

ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత రేటు ఎంతో తెలుసా..?
literacy rate AP

ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత రేటు 67.5% గా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోకసభలో జరిగిన సమావేశంలో వైసీపీ ఎంపీ తనూజారాణి అడిగిన ప్రశ్నకు, కేంద్ర మంత్రి జయంత్ Read more

తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Krishna statue unveiled in

గుంటూరు జిల్లా తెనాలిలో దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, నిర్మాత ఆదిశేషగిరిరావు పాల్గొని విగ్రహాన్ని Read more

×