हिन्दी | Epaper
ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం

APSRTC: రాజమహేంద్రవరం నుండి అరుణాచలంకి ఏపీఎస్ఆర్టీసీ సేవలు

Anusha
APSRTC: రాజమహేంద్రవరం నుండి అరుణాచలంకి ఏపీఎస్ఆర్టీసీ సేవలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఆర్టీసీ) భక్తుల కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 22న ‘అరుణాచలం యాత్ర’ (Arunachalam Yatra) పేరిట నాలుగు రోజుల పుణ్యయాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భక్తులు మూడు ప్రముఖ దేవాలయాలను సందర్శించే అరుదైన అవకాశం పొందనున్నారు.నాలుగు రోజుల ఈ యాత్రలో మూడు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.కాణిపాకం, అరుణాచలం, తిరుపతి క్షేత్రాలను చూసేలా ప్లాన్ చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ఈ ఏర్పాటు చేసింది. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో అధికారులు యాత్రకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ అరుణాచలం యాత్ర కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ బస్సులో పుష్‌బ్యాక్ సీట్లు, టీవీ సౌకర్యం ఉన్నాయన్నారు.ఈ బస్సు 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం డిపో నుంచి బయలుదేరుతుంది. 

అధికారులు తె

యాత్రలో భాగంగా కాణిపాకంలో మహాగణపతి ఆలయం దర్శనం ఉంటుంది. తరువాత అరుణాచలంలో అరుణాచలేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అక్కడ గిరి ప్రదక్షిణ కూడా ఉంటుంది. చివరగా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని (Tirumala Venkateswara Swamy Temple) దర్శించుకునే అవకాశం ఉంది. ఈ యాత్రకు ఒక్కొక్కరికి బస్సు టికెట్ ధర రూ.3,500గా నిర్ణయించారు. టికెట్ ధరలో అల్పాహారం, టీ, భోజనం ఖర్చులు ఉండవు. ఎవరైనా మార్గ మధ్యలో గదులు తీసుకోవాలనుకుంటే ఆ ఖర్చు కూడా యాత్రికులే భరించాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

 APSRTC: రాజమహేంద్రవరం నుండి అరుణాచలంకి  ఏపీఎస్ఆర్టీసీ సేవలు
APSRTC

యాత్రకు వెళ్లాలనుకునేవారు

ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. అరుణాచలం యాత్రకు వెళ్లాలనుకునేవారు టికెట్ల కోసం ఆర్టీసీ డిపోలో సంప్రదించాలని అధికారులు సూచించారు. మరింత సమాచారం కోసం 95023 00189, 99666 66544, 98660 45588 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు ఏపీలోని వివిధ డిపోలో నుంచి అరుచలానికి ప్రత్యేక ప్యాకేజీలో యాత్రను ప్లాన్ చేస్తున్నాయి. మూడు నుంచి రోజుల పాటూ ఈ యాత్ర ఉంటోంది. తాజాగా రాజమహేంద్రవరం డిపో నుంచి యాత్ర ప్రారంభంకానుంది.

Read Also: AP Mini bypass: ఆంధ్రాలో మరో మినీ బైపాస్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870