Andhrapradesh: ఈ నెల 23 న ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

Read Time:  1 min
Andhrapradesh: ఈ నెల 23 న ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల
Andhrapradesh: ఈ నెల 23 న ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల
FONT SIZE
GET APP

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తరుణంలో, ఇప్పుడు పదో తరగతి ఫలితాల తేదీలను అధికారికంగా ఖరారు చేశారు. ఫలితాలను అధికారిక వెబ్ సైట్లతో పాటుగా మార్కుల మెమోలను అభ్యర్ధుల వాట్సాప్ కు పంపేలా నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఏపీలో పదో తరగతి ఫలితాల తేదీ ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) ఫలితాలను ఈ ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు- 5,64,064, తెలుగు మాధ్యమం విద్యార్థులు- 51,069 ఈ ఏడాది ఫలితాల ప్రకటన మరింత సాంకేతిక ఆధారంగా జరగనుంది. విద్యార్థులు వారి ఫలితాలను సాధారణ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా పొందే అవకాశం కల్పించారు.

ఫలితాల కోసం వాట్సాప్ సేవలు

విద్యార్థులు తమ SSC ఫలితాలను మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా సులభంగా పొందొచ్చు. ఫలితాల కోసం విద్యార్థులు వాట్సాప్‌ నెంబర్ 9552300009 లేదా అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ద్వారా అందుబాటులోకి తేనున్నారు. ఫలితాలను పొందేందుకు ఇది ఒక సులభమైన మార్గం.

Read also: ‘E-check’: నేడు ఏపీలో మరో కార్యక్రమానికి శ్రీకారం

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.