భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష

Read Time:  1 min
chanrdrababu
chanrdrababu
FONT SIZE
GET APP

అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, అధికారులు తీసుకుంటున్న చర్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. స్కూళ్లకు సెలవు ప్రకటించినట్టు తెలిపారు.

ap cyclone


రైతులకు సాయం
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని… వర్షాల అనంతరం పంట నష్టం వివరాలను సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు అందేలా చూడాలని చెప్పారు. అన్ని స్థాయుల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండి పని చేయాలని ఆదేశించారు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.