YS Jagan DA Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలకంగా మారిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో తనపై ఉన్న ఆరోపణలను తొలగించాలని కోరుతూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.
Read Also:Girl Murder Case: మదనపల్లె ఘటనపై హోం మంత్రి అనిత స్పందన

తాను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విధులు నిర్వర్తించానని శ్రీలక్ష్మి కోర్టుకు విన్నవించారు. అయితే, ఆమె విధుల్లో నియమాలను ఉల్లంఘించిందని సీబీఐ తీవ్రంగా వాదించింది. శ్రీలక్ష్మి సహకారంతో ఆమె మరిది భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని, ఆమె కూడా నేరుగా లంచం డిమాండ్ చేసినట్లు సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారని సీబీఐ పేర్కొంది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్కు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ కేసులో ఆమెపై విచారణ కొనసాగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: