📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ బేగ్ అరెస్టు

Author Icon By Ramya
Updated: February 23, 2025 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి


డబ్బుకోసం పట్టపగలే ఒక వ్యక్తిని కిడ్నాప్‌ చేసి కారులో చిత్రహింసలు పెట్టిన కేసులో వైసీపీ కౌన్సిలర్‌, మరొక వ్యక్తిని పోలీసులు అరె్‌స్టచేశారు. ఈ నెల 5వ తేదీనగుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. పోలీసులు బృందాలుగా ఏర్పడి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, వైసీపీకి చెందిన తెనాలి మున్సిపల్‌ కౌన్సిలర్‌ మొఘల్‌ అహ్మద్‌ బేగ్‌తో పాటు షేక్‌ రహమాన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. తెనాలి త్రీటౌన్‌ సీఐ రమే్‌షబాబు కథనం మేరకు.. వైసీపీ కౌన్సిలర్‌ అహ్మద్‌బేగ్‌ ఈ నెల 5న వార్పురోడ్డులో పనిచేసుకుంటున్న కార్పెంటర్‌ షేక్‌ మస్తాన్‌ వలిని పట్టపగలే కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. తెనాలి నుంచి విజయవాడ వరకూ కారులోనే చితకబాదుతూ డబ్బులు డిమాండ్‌ చేశాడు.

విజయవాడలో చెన్నై నుంచి రావాల్సిన కీలక వ్యక్తి రాలేదన్న కారణంతో వారు డిమాండ్‌ చేసిన డబ్బు ఇవ్వలేనన్న బాధితుడితో రూ.10 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుని తిరిగి తెనాలిలో వదిలిపెట్టారు. బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దీనిపై కేసు నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న అహ్మద్‌ బేగ్‌పై గతంలో రెండు కిడ్నాప్‌ కేసులున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు దౌర్జన్యాలకు పాల్పడడంతో అతనిపై రౌడీషీట్‌ కూడా తెరిచారు. శనివారం మొగల్‌ అహ్మద్‌, రహమాన్‌ తెనాలి వచ్చినట్టు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు షేక్‌ ఇర్ఫాన్‌, షేక్‌ హుమయున్‌ క్రిస్టీ పరారీలో ఉన్నారని వీరిని కూడా అరెస్ట్‌ చేస్తామని సీఐ రమే్‌షబాబు చెప్పారు.

తెనాలిలో కిడ్నాప్, హత్యాయత్నం కేసు

వైకాపా కార్పొరేటర్ అహ్మద్ బేగ్ పై కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ నెల 5న కార్పెంటర్ షేక్ మస్తాన్ ను బలవంతంగా కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.

అహ్మద్ బేగ్, రహమాన్ అరెస్టులు

ప్రధాన నిందితుడు అహ్మద్ బేగ్, అతనికి సహకరించిన రహమాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగినప్పటినుండి అహ్మద్ బేగ్ పరారీలో ఉండగా, అతనిని అదుపులోకి తీసుకున్నారు.

అహ్మద్ బేగ్ పై గతంలో ఉన్న కేసులు

అహ్మద్ బేగ్ పై గతంలో రెండు కిడ్నాప్ కేసులు ఉన్నాయని సీఐ రమేశ్ బాబు తెలిపారు. అతనిపై రౌడీ షీట్ కూడా తెరిచారు.

నిందితులు పరారీలో

ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు షేక్ ఇర్ఫాన్, షేక్ హుమయూన్ పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేయాలని సీఐ తెలిపారు.

విజయవాడకు తీసుకెళ్లి డబ్బు డిమాండ్

అహ్మద్ బేగ్, షేక్ మస్తాన్‌ను విజయవాడకు తీసుకెళ్లి పది లక్షలు డిమాండ్ చేసి, తిరిగి తెనాలిలో వదిలిపెట్టారు.

#AhmedBeg #AttemptedMurder #crimenews #KidnapCase #MurderAttempt #PoliceArrests #TelanganaPolice #TeluguNews #Tenali #TenaliCrime #YCPCorporator Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.