📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే లైన్ ఎక్కడంటే?

Author Icon By Anusha
Updated: May 11, 2025 • 5:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అమరావతిని దేశంలోని అన్ని ప్రముఖ నగరాలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. అలాగే అమరావతి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 2025-26 బడ్జెట్‌లో అమరావతి రైల్వే లైన్ మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అమరావతి మీదుగా ఎర్రుపాలెం- నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 56 కి.మీ. మేర నిర్మించే ఈ రైల్వే లైన్ కోసం రూ.2,545 కోట్లు వ్యయమవుతుందని అంచనా. అయితే అమరావతి రైల్వే లైన్ నిర్మాణం కీలక అప్ డేట్ వచ్చింది.అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టు మొదటి దశ పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే (South Central Railway)టెండర్లను ఆహ్వానించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లాల్లో భూసేకరణ దాదాపు పూర్తయింది, గుంటూరు జిల్లాలో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎర్రుపాలెం-అమరావతి రైల్వే లైన్ కోసం భూసేకరణ పూర్తయిందని, రైల్వే అధికారులు టెండర్ డాక్యుమెంటేషన్‌తో సిద్ధంగా ఉన్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. అమరావతి రైల్వే లైన్ మొదటి దశలో రూ. 450 కోట్ల అంచనాతో 27 కిలోమీటర్ల రైల్వే ట్రాక్, రూ. 350 కోట్ల అంచనాతో కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మించనున్నారు.

ఏపీలో కొత్త రైల్వే లైన్ ఎక్కడంటే?

అభివృద్ధి

అమరావతి రైల్వే లైన్ మొదటి దశ పనులను మూడేళ్లలోగా పూర్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకోగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్లలోపు పూర్తి చేయాలని కోరారు. అయితే రెండేళ్లలోపు ట్రాక్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రైల్వే శాఖ అంగీకరించింది. కృష్ణా నది(Krishna river)పై వంతెన నిర్మాణానికి మూడేళ్లు పట్టనుంది. అమరావతి రైల్వే లైన్‌కు అదనంగా, రైల్వే మంత్రిత్వ శాఖ అమరావతి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ రైల్వే జంక్షన్ కోసం 1,500 ఎకరాలను కేటాయించింది. మరోవైపు ప్రస్తుతం ఎర్రుపాలెం నంబూరు మధ్య సింగిల్ ట్రాక్ నిర్మాణ పనులపై రైల్వేశాఖ ఫోకస్ పెట్టింది. అయితే తాడికొండ ప్రాంతంలోని కొంతమంది రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. రైల్వే అధికారులు పరిహారం తక్కువగా ఉందని చెప్తున్నారు. మార్కెట్ రేట్లకు అనుగుణంగా పరిహారం మొత్తం చెల్లించాలని కోరుతున్నారు రైతులు.

Read Also : Quantum Valley: దేశంలోనే తొలిసారిగా క్వాంటం వ్యాలీ ఎక్కడంటే?

#AmaravatiRailwayLine #APInfrastructure #NewRailwayProject #southcentralrailway Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.