📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

పల్నాడు జిల్లా లో రెచ్చిపోతున్న వాహన దొంగలు

Author Icon By Anusha
Updated: April 7, 2025 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లో ని పల్నాడు జిల్లా నరసరావుపేటలో వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రివేళ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌లు, ఆటోలు టార్గెట్ చేస్తూ ముఠాలు చోరీలకు పాల్పడుతున్నారు. గట్టి తాళాలు వేసినా, సీసీ కెమెరాలు పెట్టినా దొంగలు గుట్టుచప్పుడు కాకుండా వాహనాలను అపహరిస్తున్నారు. వరుస దొంగతనాల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.గత కొన్ని రోజులుగా వరుసగా వాహనాలు అదృశ్యమవుతుండటంతో పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా దొంగతనం చేసే ముఠా పని తీరు బయటపడింది. వీరు అర్ధరాత్రి వచ్చి సెకండ్స్ లో తాళాలు పగులగొట్టి బైక్ లేదా ఆటోను దొంగిలించి వెళ్లిపోతున్నారు.

వాహన దొంగతనాలు

సీసీ ఫుటేజ్ చూస్తే వారికి అసలు సంగతి తెలియలేదు. నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామిరెడ్డిపేటలో శావల్యాపురం బొందిలిపాలేనికి చెందిన వీరాంజనేయులు ఐదు నెలలుగా లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఆయన బైక్‌ను రెండు రోజుల క్రితం అర్ధరాత్రి ఇద్దరు యువకులు వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ సీన్ మొత్తం ఆ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు వీరాంజనేయులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అదే రోజు పట్టణంలోని ప్రకాష్‌నగర్‌‌లో ఆరవై అడుగుల రోడ్డు మూడో లైనులో మరో చోరీ జరిగింది. అక్కడ స్థానికుడైన కటకల నాగరాజు ఆటోను రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు,ఆయన కూడా వెంటనే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే ఈ నెల 11 క్రిస్టియన్‌పాలేనికి చెందిన సురేంద్రబాబు నరసరావుపేట రైల్వేస్టేషన్‌ ఆవరణలో తన బైక్‌ను పార్క్ చేసి వినుకొండ వెళ్లాడు ఆయన తిరిగొచ్చి చూసేసరికి బైక్ కనిపించలేదు.

ఫిర్యాదులపై విచారణ

నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు ప్రజల ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను అనలైజ్ చేస్తూ, అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. వాహనదొంగల ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

రాత్రివేళల బైక్‌లు, ఆటోలు వీధుల్లో కాకుండా ఇంటి లోపల ఉంచాలి. గట్టి తాళాలు, యాంటీ-థెఫ్ట్ లాక్స్ ఉపయోగించాలి. అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. సీసీ కెమెరాలను ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకోవాలి.నరసరావుపేటలో వరుస ఘటనల కారణంగా ప్రజలు భయంతో ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.దొంగలు ప్రధానంగా ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్‌లు, ఆటోలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా వచ్చి వాహనాలను ఎత్తుకెళ్లిపోతున్నారు.

#AutoTheft #BikeStolen #BreakingNews #CCTVFootage #CrimeAlert #Narasaraopet #Palnadu #PoliceInvestigation #StaySafe #VehicleTheft Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.