📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vallabhaneni Vamsi: కోర్టు అనుమతితో వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు

Author Icon By Anusha
Updated: May 23, 2025 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ నేత,గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. బాపులపాడు మండలంలో వెలుగు చూసిన నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి ఆయన్ను విచారించే నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఉదయం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోకి తీసుకుని కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు, వంశీ(Vallabhaneni Vamsi)ని రెండు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. పోలీసుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, రెండు రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. దీంతో అధికారులు ఆయన్ను కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Vallabhaneni Vamsi: కోర్టు అనుమతితో వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు

విచారణ

బాపులపాడులో అర్హులైన పేదలకు కాకుండా, నకిలీ పట్టాలు సృష్టించి పంపిణీ చేశారన్న ఆరోపణలపై వల్లభనేని వంశీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు గతంలోనే పీటీ వారెంట్ దాఖలు చేసి, వంశీని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు.కాగా, వల్లభనేని వంశీ ఇప్పటికే పలు ఇతర కేసుల్లో కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. తాజా పరిణామంతో నకిలీ పట్టాల కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

Read Also: AirPort: ఏపీలో కొత్తగా ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం

#AndhraPolitics #CustodyNews #VallabhaneniVamsi #FakePattaCase #YCPLeader Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.