విజయవాడ VAA : నిబంధనలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే గ్రామ సచివాలయాల్లోని గ్రామ వ్యవసాయ సహాయకుల (VVA) లను బదిలీ చేయడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఉమ్మడి కర్నూలు, కృష్ణా జిల్లాల్లో జరిగిన బదిలీలను రద్దు చేసింది. గత మే, జూన్ నెలల్లో వెలువడిన జీవోలు 23, 5లకు అనుగుణంగా కౌన్సెలింగ్/ బదిలీలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పై రెండు జిల్లాల్లో అత్యధికంగా ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే బదిలీలు జరిగాయని గుర్తించింది. పారదర్శకత, వ్యక్తిగతాభిమానం, ఆశ్రిత పక్షపాతం అడు కోవాలని పేర్కొంది. సిఫార్సులను యాంత్రి G కంగా జిల్లా కలెక్టర్లు ఆమోదించారని తప్పుపట్టింది. రూల్స్ ప్రకారమే బదిలీలు జరిగాయన్న ప్రభుత్వ వాదనను కొట్టివేసింది. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుగుణంగా బదిలీలు జరిగాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం ఖండించలేదని చెప్పింది. బాధ్యత నుంచి అధికారులు తప్పుకున్నట్లు ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ న్యాపతి విజరు ఇటీవల ఆదేశాలిచ్చారు.

బదిలీ జరిగిన తీరును సవాలు చేస్తూ కడప, అన్నమయ్య, అనంతపురం, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి కర్నూలు జిల్లాలకు చెందిన గ్రామ వ్యవసాయ సహాయకులు పెద్ద సంఖ్యలో పిటిషన్లు వేశారు. ఆ రెండు జిల్లాల్లోనే 217 మంది బదిలీకి ఎంపీ, ఎమ్మెల్యేలు సిఫారసు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 115 మంది, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 102 మందిని బదిలీ చేయాలని ప్రజాప్రతి నిధులు సిఫార్సులు చేశారు. ఈ రెండు జిల్లాల్లో జరిగిన బదిలీలను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు (High Court) ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో ప్రజా ప్రతినిధుల సిఫార్సులు పెద్దగా లేవని, బదిలీల్లో జోక్యం చేసుకోబోమని ప్రకటించింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :