నారా లోకేశ్ చొరవతో మంగళగిరికి రెండు ఎలక్ట్రిక్ బస్సులు

Read Time:  1 min
నారా లోకేశ్ చొరవతో మంగళగిరికి రెండు ఎలక్ట్రిక్ బస్సులు
FONT SIZE
GET APP

నారా లోకేశ్ చొరవతో మంగళగిరికి రెండు ఎలక్ట్రిక్ బస్సులు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఉండవల్లి నివాసంలో జెండా ఊపి ఈ సేవలను ప్రారంభించిన లోకేశ్, ప్రజల ప్రయాణ సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పిటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాకపోకల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన మంత్రి లోకేశ్, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా బస్సులను సమకూర్చాలని మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (MEIL) సంస్థను అభ్యర్థించారు. లోకేశ్ విజ్ఞప్తికి స్పందించిన MEIL ఫౌండేషన్, రూ.2.4 కోట్ల విలువైన రెండు అత్యాధునిక Olectra 7 మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది.ఈ ఉచిత బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్ వరకు నడుస్తుంది.

నారా లోకేశ్ చొరవతో మంగళగిరికి రెండు ఎలక్ట్రిక్ బస్సులు
నారా లోకేశ్ చొరవతో మంగళగిరికి రెండు ఎలక్ట్రిక్ బస్సులు

ఈ బస్సులలో ఒక్కో బస్సు 18 మంది ప్రయాణికుల

మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి ఆలయానికి సేవలు అందిస్తుంది.ఎయిమ్స్ వెళ్లే బస్సు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.అలాగే పానకాలస్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది. ఈ బస్సులలో ఒక్కో బస్సు 18 మంది ప్రయాణికులను ఒకేసారి తీసుకెళ్లగలదు. పూర్తిగా ఛార్జింగ్ చేస్తే, 150 కి.మీ. వరకు ప్రయాణించగల సామర్థ్యం ఈ బస్సులకు ఉంది.ఈ బస్సులు డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ (EHPS), రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ (VTS), రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ (RPAS) వంటి ఆధునిక భద్రతా సౌకర్యాలతో అందించబడ్డాయి.

ఈ ఉచిత బస్సు సేవల ద్వారా మంగళగిరి

ఈ కార్యక్రమంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ K.V. ప్రదీప్, ఎయిమ్స్ డైరక్టర్ శాంతా సింగ్, డిప్యూటీ డైరక్టర్ శశికాంత్, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ. కోటిరెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ఉచిత బస్సు సేవల ద్వారా మంగళగిరి, ఉండవల్లి పరిధిలోని ప్రజలకు మరింత ప్రయాణ సౌకర్యం కలుగుతుందని, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికీ ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని మంత్రి లోకేశ్ తెలిపారు.

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.