📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

TTD: అన్యమత ఉద్యోగస్థులపై టీటీడీ వేటు

Author Icon By Anusha
Updated: April 19, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లోని (టీటీడీ) తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరిధిలో అన్యమతస్తులు పనిచేయకుండా తొలగిస్తామని గతంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన అమల్లోకి వచ్చింది. ఈ మేరకు టీటీడీ పరిధిలో ఉన్న సంస్థల్లో పనిచేస్తున్న అన్యమతస్తుల్ని తొలగించే ప్రక్రియను టీడీడీ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ ఓ విద్యాసంస్ధలో ప్రిన్సిపాల్ స్ధాయిలో పనిచేస్తున్న ఉద్యోగిని బదిలీ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.పూర్తీ వివరాలు మీకోసం.

బదిలీ

తిరుమల వెంకన్నకు ఉన్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని టీడీడీ పరిధిలో అన్యమత ఉద్యోగులు లేకుండా చూస్తామని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో టీటీడీ ఆ మేరకు తమ పరిధిలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగుల్ని బదిలీలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న జి.అసుంతను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ అసుంతను నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీచేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. క్రైస్తవ మత సంప్రదాయాలు పాటిస్తూ పూజ చేయకుండా, హారతి ఇవ్వకుండా, తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా ఉన్నదని, ఆమె పై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఆమెను డిప్యూటేషన్ పై నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఉత్తర్వులు ఇచ్చారు. ఆమెపై ల్యాబ్ పరికరాల మాయం సహా ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్లు టీటీడీ తెలిపింది.

అన్యమత

టీటీడీలో అన్యమత ఉద్యోగుల్ని తొలగించాలని ఎప్పటి నుంచో భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ మంది అన్యమత ఉద్యోగుల్ని టీడీడీలో నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వీరి తొలగింపుకు ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. తాజాగా బీజేపీతో కలిసి అధకారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఈ మేరకు అన్యమత ఉద్యోగుల తొలగింపుకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు టీటీడీ వాటిని అమల్లోకి తెచ్చింది.గతంలో 18 మంది ఉద్యోగుల పై టీటీడీ వేటు వేసింది.చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని టిటిడి బోర్డు గతంలో హిందూ ఉద్యోగులు మాత్రమే టిటిడిలో పనిచేయాలని పేర్కొంది.తిరుమల హిందూ విశ్వాసం పవిత్రతకు చిహ్నంగా ఉండేలా చూసుకోవడానికి తన నిబద్ధతను నాయుడు ఇంతకుముందు నొక్కిచెప్పారు. 1989 ఎండోమెంట్ చట్టం ప్రకారం, టీటీడీ ఉద్యోగులు హిందూ ఆచారాలకు కట్టుబడి ఉండాలి టీటీడీ పవిత్రతను భక్తుల మనోభావాలను ప్రభావితం చేసే అంశంపై బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది.

Read Also: Visakhapatnam : కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం

#AndhraPradesh #TirumalaTirupatiDevasthanam #ttd #TTDBoard Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.