తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సాలకట్ల బ్రహ్మోత్సవాలకు(Brahmotsavam) హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లాంఛనంగా ఆహ్వానించింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల తొలి ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు.

టీటీడీ ఛైర్మన్, అధికారుల భేటీ
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోని బృందం బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును(Chandrababu) కలిసింది. ఈ బృందంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యురాలు జానకీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను సమర్పించారు. అనంతరం వేద పండితులు సీఎంకు(CM) వేదాశీర్వచనాలు పలికారు.
ఈ భేటీలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సీఎంకు వివరించినట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు. భక్తుల కోసం చేపడుతున్న చర్యలు, కల్పిస్తున్న సదుపాయాలతో పాటు, ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలోని కీలక నిర్ణయాలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24న ప్రారంభమై అక్టోబర్ 2 వరకు వైభవంగా జరగనున్నాయి
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఎవరిని ఆహ్వానించింది?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించింది.
ఆహ్వానాన్ని అందించిన టీటీడీ బృందంలో ఎవరు ఉన్నారు?
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యురాలు జానకీదేవి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: