తిరుమల : పవిత్రమైన శ్రావణ మాసంలో ఆగస్ట్ 8న శుక్రవారం వరలక్ష్మీ వతం (varalakshmi vratham) పర్వదినం సందర్భంగా టిటిడి, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సౌబాగ్యం నిర్వ హిస్తోంది. ఈ కార్యక్రమానికి అవసరమైన సుమంగళిద్రవ్యాల సామాగ్రిని ఓ దాత సహకారంతో సిద్ధంచేశారు. సౌభాగ్యం సామాగ్రికి గురువారం శ్వేత భవనంలో టిటిడి, డిపిపి అధికారులు, సిబ్బంది శ్రీవారో సేవకులు ప్రత్యేక పూజలు (Pooja) నిర్వహించారు. టిటిడి (TTD) ఆధ్వర్యంలో రెండు తెలుగురాష్ట్రాల్లో నడుస్తున్న 51 ఆలయాల్లో సౌబాగ్యం పేరుతో మహిళలకు గాజులు , పసుసు, కుంకుమ, అక్షింతలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సౌభాగ్యులకు గాజులు, పద్మావతిఅమ్మవారి కుంకుమప్యాకెట్లు, కంకణాలు, పసుపుదారాలు, పద్మావతి అమ్మ వారి లక్ష్మీఅష్టోత్తర శతరా మావళి పుస్తక ప్రసాదాలను అందించనున్నారు. 8 లక్షలు గాజులు, 1.40లక్షలు కంకణాలు, 1.40 లక్షలు పసుపుదారాలు, కుంకుమ ప్యాకె ట్లు, పుస్తకప్రసాదాలను అందించ నున్నారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Suryapet District: పెన్షన్ కోసం వృద్ధురాలి కష్టాలు..కంటతడి పెట్టిస్తున్న వీడియో