Tirumala : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏడు కొండల శ్రీవేంకటేశ్వర స్వామి మూలవిరాట్టుకు పవిత్రోత్సవాల్లో రెండోరోజు బుధవారం (Wednesday) ఉదయం పవిత్ర మాలలు సమర్పించారు. ఆలయం లోపల ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరునికి. ద్వజస్తంబానికి, ఉపఆలయాల్లో స్వామివార్లకు, ఉత్సవమూర్తులకు, బేడి ఆంజనేయస్వామికి పవిత్రమాలలు సమర్పించారు. ప్రతి ఏడాది మూడురోజులుపాటు జరిగే పవిత్రోత్సవాల్లో (During holy festivals) రెండవరోజు బుధవారం ఉదయం ఆలయంలోపల సంపంగిప్రాకారంలోని కల్యాణోత్సవ మండపం యాగశాలలో వేడుకగా శ్రీదేవిభూదేవిసమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు హోమాలు వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరిజలంతదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ వెంకన్న మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు, జయవిజయులకు, గరుడాళ్వారుకు, వరదరాజస్వామికి, విశ్వక్సేనులకు, యోగనరసింహస్వామికి, వకుళమాత అమ్మవారికి, భాష్యకార్లకు, పోటుతాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠంకు పవిత్రమాలలు సమర్పించారు. సాయంత్రం ఉభయదేవేరులతో మలయప్పస్వామి పవిత్రమాలలుతోనే ఆలయ నాలుగుమాఢవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాల్లో పెద్దజీయ్యంగారు, చిన్నజీయ్యంగారు, టిటిడి ఇఒ జె.శ్యామలరావు దంపతులు, టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి దంపతులు, ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం ఆలయ పేష్కార్ రామకృష్ణ, పారుపత్తేదార్ హిమత్ గిరి, విజిలెన్స్ వింగ్ విఎస్ నెట్టం తులసీ వెంకటరామ్కుమార్, విఎసి అల్లం సురేంద్ర, ఆలయ ఏవిఎస్ రాజశేఖర్, ఆలయఅర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :